పుట:భాస్కరరామాయణము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్నది యచ్చటికి మన మరిగి యప్పాపాత్మురాలి నాపంపునఁ దునిమి యద్దేశం
బులు నిష్కంటకంబులు సేయుము నీకుఁ దక్క నన్యులకు నాతాటక యున్నదే
శంబు గమింప నశక్యంబు.

237


క.

అన విని విశ్వామిత్రుం, గనుఁగొని యారాముఁ డనియెఁ గామిను లబలల్
గనుఁగొన నీయక్షికిఁ బెం, పెనయ సహస్రగజసత్త్వ మేక్రియఁ గలిగెన్.

238


చ.

అనుడు సుకేతునాముఁ డగుయక్షుం డొకం డనపత్యుఁ డై చిరం
తనతప మాచరించి తగ ధాతవరంబునఁ గూఁతు నొక్కతం
దనర సహస్రనాగబలఁ దాటకఁ గాంచి వివాహవేళయం
దు నలువు నొందుజంభునిసుతుం డగుసుందున కిచ్చెఁ బత్నిఁగన్.

239


క.

సుందుఁడుఁ దాటకయం దొక, నందన మారీచుఁ గాంచి నాశము నొందన్
నందనుఁడుఁ దాను నాఁకటఁ, గంది యగస్త్యముని మ్రింగఁ గదియఁగ వారిన్.

240


క.

కనుఁగొని కనలి యగస్త్యుఁడు, ఘనరాక్షసమూర్తు లీరు గం డని శపియిం
చిన రక్కసులై యిక్కా, ననమునఁ జరియింతు రెపుడు నరవరముఖ్యా.

241


క.

రణశూరత నీదుశ్చా, రిణిని దునుము పాపమతిని స్త్రీ నైనను ని
ర్ఘృణతం జంపఁగ నగు బ్రా, హ్మణచాతుర్వర్ణ్యరక్షణార్థము గాఁగన్.

242


క.

జగదపకారిణి యగునా, భృగుపత్నిం దునిమె శౌరి పృథ్వి హరింపం
దెగినవిరోచనసుత యగు, మగువఁ బురందరుఁడు దునిమె మఱియు ననేకుల్.

243


క.

జనహంత్రు లయిన కాంతలఁ, దునుమాడిరి భూమిపతులు దుర్జనతాభం
జనమున నగునది దోష, మ్మనక ప్రజారక్షచేత యది ధర్మ మగున్.

244


చ.

అన విని కౌశీకోక్తులకు నారఘురాముఁడు సంతసించి మ
జ్జనకునియట్ల నీవు మునిసత్తమ నా కటు గాన నెమ్మి
జనపతిపన్పు నీపనుపు సమ్మతిఁ జేసెద దుష్టతాటకా
హననముఁ జేసి భూసురగవామరలోకహితంబు సేసెదన్.

245

శ్రీరాముఁడు తాటకను సంహరించుట

వ.

అని పలికి.

246


ఉ.

అంతఁ గడంక రాముఁడు [1]సమగ్రభుజాబలవిక్రమోత్సవం
బెంతయుఁ బర్వ మౌర్వి మొరయించె దిగంతరదంతికర్ణరం
ధ్రాంతరసాగరాంతరధరాభ్రతలాంతరచక్రవాళశై
లాంతరసర్వభూధరగుహాకుహరాంతరపూరితంబుగన్.

247


క.

ఆతతచాపధ్వని విని, యాతంకముతో వనాటు లందఱుఁ బఱవన్
భీతియుఁ గోపముఁ బెనఁగొన, నాతాటక యన్నినాద మగుచక్కటికిన్.

248


చ.

ఉరుతరపాదఘట్టనల నుర్వి చలింపఁగ మేనిగాలి ను

  1. శరాసన మెక్కిడి విక్ర' వ్రా. ప్ర.