Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్దొరయుపసిండిబొమ్మికముతోడిశిరంబు వసుంధరం బడన్.

1055


వ.

ఇ ట్లతికాయుండు గూలినం బ్లవంగపుంగవులు సిద్ధచారణాదులు నుచితవాక్యం
బుల సౌమిత్రిఁ గొనియాడి రతం డరుదెంచి యన్నచరణంబులకుం బ్రణమిల్లిన
నమ్మహాత్ముండు గాఢాలింగనపూర్వకంబుగా దమ్ముని గారవించె నంత హతశేషు
లయినదోషాచరులు విఱిగి పాఱి లంక సొచ్చి సమరనృత్తాంతం బెఱింగించిన
రావణుండు శోకమూర్ఛితుం డై కొండొకదడవునకు బాష్పాకులలోచనుం
డగుచు మంత్రులం గనుంగొని.

1056


క.

కదనంబున ధూమ్రాక్షుఁడు, మొదలుగఁ గల రాక్షసోత్తములు శస్త్రకళా
విదు లహితులచేతం బొలి, సెదరే యిటు పోయి పోయి సేనలతోడన్.

1057


ఉ.

నాసుతుఁ డింద్రజిత్తు కదనంబునఁ బన్నగపాశబద్ధులం
జేసిన నిర్జరాదులకుఁ జెల్లదు వీడ్వడ పట్టికట్టులుం
బాసి పరాక్రమించెదరు పంక్తిరథాత్మజు లింక వీరితో
నీ సొనరించువీరవరు నెవ్వనిఁ గాన జగత్త్రయంబునన్.

1058


తే.

మున్ను నాదాడి కెప్పుడు మూసియుండు, దివిజపురివాకి లిప్పుడు దెఱచినారు
లంక ఘటితకవాటమై సొంక మడఁగి, యుండ రిపు లిట్టు లుండ నే నున్నవాఁడ.

1059


క.

నడురేయి సంజవడున, ప్పుడు వేగెడువేళఁ జొచ్చి పోటునకు రిపుల్
గడఁగుదురు మీరు నాయిత, పడి యుండుం డెల్లవారు బలములతోడన్.

1060


వ.

అని పలికి యంతఃపురంబునకుం జని చింతాకులమానసుం డై నిట్టూర్చు నిగిడిం
చిన మేఘనాదుండు తండ్రి కి ట్లనియె.

1061


ఉ.

ప్రాకృతునట్లు నీవు ధృతి పట్టక ప్రాభవ మెల్లఁ దూలఁగా
శోకముఁ బొందె దాలముల శూరులు చచ్చుట లింత వింతలే
నీకోడు కింద్రజిత్తు రజనీచరనాయక దివ్యసాయకా
నీకముతోడ వీఁడె పగ నీఁగఁ గలండు విచార మేటికిన్.

1062


తే.

దివిజదనుజయక్షాదులఁ దృణము సేయు, నాశరాగ్నులు సైప వానరులు నరులు
నెంతవా రింతఁ జింతింప వింక నైన, రాజధర్మంబు పరికింపు రాక్షసేంద్ర.

1063

ఇంద్రజిత్తు రెండవయుద్ధము

క.

అని నేఁడు దాశరథులను, వనచరసైన్యంబుఁ గూల్చి వచ్చెద సంక్రం
దనముఖ్యులు వెను కై నను, విను నాదుప్రతిజ్ఞ యనుచు వీడ్కొని కడిమిన్.

1064


వ.

చతురంగబలసమేతుం డై ధవళచ్ఛత్రచామరంబులు మెఱయ శంఖభేరీమృదం
గాదితూర్యరవంబులు భూనభోంతరాళంబు నిండం బ్రచండగతి లంకానగరంబు
వెడలి సమరభూమి నుచితప్రదేశంబునం దేరు డిగ్గి తనచుట్టును గరితురగాది
సైన్యంబుల నుండ నియోగించి యగ్నిప్రతిష్ఠాపనంబు సేసి మంత్రతంత్రకలా
పంటులు నెఱయ మెఱయ విహితప్రకారంబున.

1065