పుట:భాస్కరరామాయణము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షితిపాలాగ్రణి సింధుదేశవిభుఁ గాశీనాథు సౌవీరు న
ప్రతిమస్నేహుని రోమపాదమహిపుం బ్రాచీనసౌరాష్ట్రభూ
పతులం దక్కినదాక్షిణాత్యనృపులం బాశ్చాత్యభూమీశులన్.

105


క.

ధరణి నతిధార్మికుల భూ, వరులఁ దదీయానుచరుల వలసినబంధూ
త్కరముల దశరథునానతి, సరగునఁ గొనిరమ్ము నీవు నమ్మక మారన్.

106


చ.

అనవుడుఁ బెక్కురత్నము లుపాయనముల్ గొని యమ్మునీంద్రుశా
సనమున వేగ మేఁగి తగ సర్వమహీశుల నాదరించి తో
కొని యధికప్రమోదమునఁ గొన్నిదినంబుల కేఁగుదెంచినం
గనుఁగొని యవ్వసిష్ఠుఁ డధికప్రమదంబున ఱేని కి ట్లనున్.

107


క.

ధరణీశు లెల్ల వచ్చిరి, [1]వెరవున మన్నించి వారి విడియించితి భూ
వర యజ్ఞము సేయంగా, నరుదె మ్మచట సకలంబు నాయిత మయ్యెన్.

108


క.

అనుచు వసిష్ఠుఁడు పలుకను, సునిశితమతి దశరథుండు శుభదినమున శాం
తను ఋశ్యశృంగునిం దో, డ్కొని క్రతువాటంబు సొచ్చెఁ గోరిక లారన్.

109


తే.

ఇట్లు సొచ్చి యద్దశరథుఁ డింద్రుకరణిఁ, బావనస్నానుఁడయి దీక్ష పరఁగఁ బూని
తనకులస్త్రీలు దాను సంతసము లార, నలరుచుండ నానాఁటి కయ్యజ్ఞభూమి.

110


ఉ.

బాలురు వృద్ధు లంధులు విపన్నులు రోగులు యోగు లోలి భూ
పాలురు ఋత్విజుల్ మునులు బ్రాహ్మణు లార్యులు బంధు లుత్తమ
స్త్రీలు సమస్తజాతులును జేరి తగం దమయిండ్లకైవడిన్
మే లగునన్నపానములు మెచ్చొదవంగ భుజించుచుండఁగన్.

111


క.

కలయఁగ నయ్యయిజనములు, వలసినవంకల సువర్ణవస్త్రాభరణా
దులు వెండి లబ్ధసంపద, లొలయఁగఁ జిత్తమునఁ దనివి నొందుచు వెలయన్.

112


క.

మండితమణిమయకాంచన, కుండలమండనవిశిష్టగురుతరరోచుల్
గండస్థలముల నెరయుచు, నుండఁగ నయ్యజ్ఞయాజుకోత్తము లొప్పన్.

113


వ.

సకలమఖకలాకోవిదు లగువసిష్ఠప్రముఖులును భూసురోత్తములును ఋశ్యశృం
గునిం బురస్కరించుకొని యజ్ఞకర్మారంభసంరంభం బెసంగ విహితక్రమంబున
గరుడోభయపక్షంబులుగా నిష్టకాచయనంబు లొనర్చి యందగ్నులు ప్రవృద్ధం
బులు సేసి ప్రవర్గ్యోపసవప్రాతస్సవనమధ్యందినసవనతృతీయసవనంబు లను
ష్ఠించి యేకవింశత్యరత్నిప్రమాణంబు లయిన యాఱేసిబిల్వఖదిరపలాశయూపం
బులును రెండుదేవదారుయూపంబులు నొక్కశ్లేష్మాతకయూపంబునుంగా ని
రువదియొక్కయూపంబు సంస్థాపించి వస్త్రభూషణమాల్యగంధాలంకృతంబుఁ
జేసి శోభనార్థంబుగాఁ గొన్నికాంచనయూపంబులు తిరిగిరా నిడి చతుష్పాదం
బులుం బక్షులుం జలచరంబులుఁ గా మున్నూఱుపశువులు పరివేష్టింపఁ బూర్వ

  1. మఱియును మన్నించువారి మన్నించితి; మరియాదుల నెల్లవారి మన్నించితి" అ. ప్ర.