పుట:భాస్కరరామాయణము.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంగదుం డి ట్లనియె.

783


సీ.

ధరణిజ వెదకక తనయాజ్ఞఁ దప్పిన, నినజుఁ డప్పుడ పట్టి మనలఁ జంపుఁ
సతికల్మిలేములు నన నిశ్చయింపక, సంశయంబునఁ బోవఁ జాలఁ గినిసి
పొం డని వెదకంగఁ బుత్తెంచుఁ గ్రమ్మఱ, నింతి లేదని నిశ్చయించి పోవఁ
గరుణఁ గాచినఁ గాచుఁ గాన జానకి వార్త, నిజముగా నెఱుఁగక నీరజాప్త
తనయునొద్దకుఁ బోరాదు మనకు నిచట, నొనరఁ బ్రాయోపవేశంబు నొందుటొండె
వనధి దాఁటి జానకిఁ జూచి వచ్చుటొండె, వలయు మఱి యొండుమార్గంబు వలను గాదు.

784


ఉ.

ఏను బయోధి దాఁటి బల మింకక లంకకుఁ బోక రాముతో
జానకివార్త యే మనుచు సమ్మతిఁ జెప్పుదు నూర కేఁగి యా
భానుజుచండదండముల పాల్పడి చావఁగఁ జాల వేగ మె
ట్లైనఁ బయోధి దాఁటి వసుధాధిపువల్లభఁ జూచి వచ్చెదన్.

785


క.

అన విని ముకుళితకరు లై, వనచరవిభు లెల్ల నపుడు వాలితనూజుం
గనుఁగొని వననిధి దాఁటఁగ, మనకును శక్యంబు గాదు మదిఁ దలపోయన్.

786


క.

నిను వాలిఁబోలెఁ జూచుచు, ననిశము నీతోడఁ గూడ నందఱు సుఖ మై
నను దుఃఖ మైనఁ బొంచెద, మినజుం డే మైనఁ జేయనిమ్ము కపీంద్రా.

787


చ.

అనవుడు జాంబవంతునకు నంగదుఁ డిట్లను సారబుద్ధి వీ
వనఘ సమస్తకార్యములు నారసి కానఁగ నేర్తు రామభూ
జనపతి యాత్మలో నలర జానకిఁ గన్గొని కార్యసిద్ధితో
ననువుగ వేగ రాఁ గలయుపాయము మా కెఱుఁగంగఁ జెప్పవే.

788


క.

అని పలుక జాంబవంతుం డను నంగదముఖ్య వానరానీకముతో
మనపూనిక సేయంగల, ఘనుఁ జెప్పెదఁ బలుకు లుడిగి కపు లుండుఁ డొగిన్.

789


వ.

అని పలికి.

790

జాంబవంతుండు హనుమంతుం గొనియాడుట

చ.

రామహితంబు సేయఁ గపిరరా జగుభానుజుపం పొనర్ప ను
ద్దామజవంబునన్ జలధి దాఁటఁగ లంక సొరంగ దక్షతన్
భూమిజఁ జూచి రాఁ గలుగు భూరిపరాక్రమశాలి వానర
గ్రామణి వాయునందనుఁడు గల్గఁగ నేరికిఁ జింత యేటికిన్.

791


వ.

అని పలికి జాంబవంతుండు హనుమంతుం గనుంగొని.

792


ఉ.

మారుతి నీదుకృత్యములు మాపయిఁ బెట్టి తొలంగి లీలతో
నూరక యున్నవాఁడవు పయోనిధి దాఁటఁగ మావశంబె వి