పుట:భాస్కరరామాయణము.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

[1]గగనంబున కి ట్లెగయుచు, ఖగపతి యంగదునితోడ గ్రక్కున మీరల్
జగతీసుతవృత్తాంతము, నెగడెద రని పలికి చనియె నిజగృహమునకున్.

758


వ.

అని పలికి సంపాతి పోయిన నంగదుండు కపులం గనుంగొని మన మింక సంపా
తి చెప్పినమార్గంబునఁ గడలి దాఁటి పోవుద మనుచు సకలవానరవీరులతోడ
దక్షిణసముద్రతీరంబున నున్న యగ్గిరి యెక్కి యచట నాసీను లై సింహనం
ఘంబులపగిదిఁ గొంతదడ వుండి యట దక్షిణసముద్రంబునుత్తరభాగంబున
నవ్వానరవీరులు.

759


సీ.

జగములు ముంపంగ సమకొన్నకైవడి, నుద్వేలముగ నుబ్బుచున్నదానిఁ
బాతాళనాగముల్ పైఁ దేలి యాకాశ, గంగలో విహరింపఁ గడఁగుదాని
నింగి మ్రింగెడుభంగి నెగయుసముత్తుంగ, భంగసంఘంబులఁ బరఁగుదానిఁ
గూలంకషాటోపకుటిలతరగ్రాహ, బడబాగ్నిఘోర మై ప్రబలుదాని
నురుఘనధ్వని నుడుగక మొరయుదాని, నాతతావర్తభీకర మైనదాని
నిబిడవర్షధారాపూర్ణనిఖిలసింధు, భూరిజలసముత్సేధి నంభోధిఁ జేరి.

760


క.

కొందఱు శైత్యము నొందిరి, కొందఱు కూర్చుండి రచటఁ గొండఱు భయముం
జెంది విషాదము నొందిరి, కొండఱు నిశ్చేష్టు లైరి కొందఱు ప్లవగుల్.

761


వ.

అప్పు డంగదుండు వారలభయం బెఱింగి వెఱవకుం డనుచుఁ బలికి యెల్లి వారి
రాశి దాఁటుద మీరాత్రి యిచట నిద్రింపుండు నెమ్మది నని బుజ్జగించి యారా
త్రి యచటఁ బుచ్చి మఱునాఁ డరుణోదయంబున సకలవానరవీరులుఁ బరి వేష్టించి
కొలువ నాగిరితటంబునఁ గూర్చుండి విషణ్ణు లైన వానరులం జూచి యంగదుం
డి ట్లనియె.

762


ఉ.

శోకముఁ బొందు నేఘనుఁడు శోకము కాలవిషంబు శోక ము
ద్రేకముఁ బొంద మానస మతివ్యథ పాల్పడు శోకమగ్నునిం
బైకొని చంపుఁ గ్రూరఫణి బాలునిఁబోలెను శోక మాత్మలోఁ
జేకొనువానికిం బరఁగఁ జెల్లునె చేయఁ బరోపకారముల్.

763


వ.

కావున శోకం బుడిగి వినుండు.

764


ఉ.

ఎవ్వఁడు రామమోదకరుఁ డెవ్వఁడు భానుజవాక్యపాలకుం
డెవ్వఁడు వార్ధి దాఁటఁగలఁ డెవ్వఁడు లంకఁ జొరంగ నోపువాఁ
డెవ్వఁడు కీశదుఃఖహరుఁ డెవ్వఁడు జానకిఁ జూచి వచ్చువాఁ
డెవ్వఁడు రామలక్ష్మణకపీంద్రులఁ జేరుచు మమ్ము నెమ్మదిన్.

765


క.

వననిధి నవలీలం గడ, చనువానిప్రసాద మొంది సతులు గృహంబుల్

  1. క. గగనంబున క ట్టెగసిన, ఖగపతి నంగదుఁడు చూచి కవుల మనుప నీ
        ఖగపతి సీతావృత్తము, నెగడఁగ వినిపించి చనియె నిజగృహమునకున్.
    వ. అని పలికి యంగదుండు వనచరులార మన మింక.....నవ్వానరవీరులు, పా. అ.