పుట:భాస్కరరామాయణము.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

భ్రాతలు కామరూపు లతిబంధురసత్వు లుదారు లైనసం
పాతిజటాయువుల్ జగతిఁ బ్రాజ్ఞులు వారలఁ జూచినావె య
న్వీతమనుష్యరూపధరు లిద్దఱలోపల నగ్రజుండు సం
పాతి జటాయు వాతనికి మక్కువతమ్ముఁడు పక్షిశేఖరుల్.

734


క.

ఎక్కడ వా రున్నా రీ, వెక్కడివాఁడ విట వచ్చి తేమిటికిన్ నీ
వెక్కుడుదుఃఖముఁ బొందెదు, తక్కక నీఱెక్క లేల దగ్ధము లయ్యెన్.

735


వ.

అని పలుకునమ్మునిచంద్రునితోడ.

736


క.

అనఘాత్మ జటాయువు నా, యనుజుఁడు సంపాతి నే నుదగ్రగతి నా
ఘనతరపక్షద్వంద్వము, చెనఁటిగఁ గాలినవిధంబు చెప్పెద మీకున్.

737


క.

ఏను జటాయువు నెంతయు, మానసమున మదము లొదవ మత్సరములతో
భానుని మనలో నెవ్వఁడు, మానుగ మును గదియనోపు మాపటిలోనన్.

738


క.

అతనికి మామారాజ్యము, లతులితగతి నిచ్చువార మనుచుఁ బ్రతిజ్ఞల్
గతివడఁ గైకొని యిరువురు. వితతబలోత్సాహధైర్యవేగము లెసఁగన్.

739


క.

ఖగగతి నిరువురమును న, త్యగణితవేగములతోడ నన్యోన్యగతుల్
నిగుడ నెగసి కడుఁబొడువున, గగనంబుననుండి పుడమి గనుఁగొన మాకున్.

740


క.

పురములు రథచక్రంబుల, కరణిన్ గిరు లూళ్లపగిది ఘననదులు వసుం
ధర హంసగణములగతిన్, ధరఁ గలకులగిరులు సౌధతతిగతిఁ దోఁపన్.

741


వ.

మఱియుం బొడువుగా నెగసి గగనతలంబున సిద్ధమార్గంబుల ఖచరసహస్రంబుల
భూషణభూషితాప్సరోగణంబులఁ జూచుచు నట నెగసి కనుంగొన నానాశాద్వ
లసస్యంబులు భూమికిఁ దిరిగి వచ్చినకులాచలంబు లావరణంబులుగాఁ బెట్టె నిడి
నయాభరణంబులుంబోలె నుండ ధరణికిఁ బరివేష్టితసాగరంబులు ముక్తాహారం
బులుంబోలె నుండ మఱియుం బొడవున కెగసి యాది క్కీది క్కని యెఱుంగలేక
యతిదూరంబునఁ బ్రళయకాలాగ్నిగతిఁ గ్రాలుచున్న యంబరంబున మహాగ్ని
రాశియుంబోలె రక్తవర్ణుం డై భూమండలప్రమాణుం డై దేదీప్యమానుం డైన
భానుండు గానంబడియె నప్పు డాదేవునితీవ్రాంశువుల దాహస్వేదశ్రమమూర్ఛా
తమంబులు గవియ వివశుం డై జటాయువు తలక్రిందుగా నురవడిం బడుచుండఁ
జయ్యన నాయనుజు ఱెక్కలనడుమ దాఁచుకొని దగ్ధుండు గాకుండ దిగంబడు
చుండఁ దరణికిరణంబులవేఁడిమి నాఫక్షంబులు గమలె నేను వింధ్యగిరిమీఁదం
బడి మఱి సముద్రంబులోఁ బడి మునింగితి జటాయువు జనస్థానంబునం బడియె
నని వింటి భాగ్యవశంబున గిరిమీఁద సముద్రంబునఁ జావక వెడలి పక్షంబులు
చెడి కాష్ఠలోష్టంబుపగిది నున్ననాకు నింకేటిజీవనం బనుచు శైలశిఖరంబున
నుండి విఱుగంబడ నుద్యోగించిననన్ను నచ్చటిజనులు నివారింపఁ బడ కు
న్నాఁడ నిట్లు.

742