పుట:భాస్కరరామాయణము.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్భరసత్త్వంబున వాలికిన్ వెడలి రా రంధ్రంబు లేకుండఁ దా
నురుతైలంబు బిలంబువాత నిడి రాజ్యోల్లాసి యై వచ్చి వా
నరరాజ్యం బనురక్తిఁ జేకొని కడున్ గర్వాతిరేకంబునన్.

674


క.

జనకసముం డగ్రజుఁ డా, తనిసతి ధర్మమునఁ దల్లి దనయగ్రజుదా
రను దారను వరియించెను, జన దన కినసూనుఁ డతఁడు సద్ధార్మికుఁడే.

675


క.

తనకును రాజ్యం బిచ్చిన, ఘను రామునిఁ గానఁ బోక కడుఁగిన్కను రా
మునితమ్ముఁడు వచ్చిన మఱి, మనమున బెగ డంది కాద మదమఱి వచ్చెన్.

676


వ.

ఆసుగ్రీవుండు కృతఘ్నుండును బాపచిత్తుండును గావున మాతండ్రివలని పూర్వ
వైరంబుఁ దలంచి మట్టుపెట్టుం గాని న న్నేల పట్టంబుఁ గట్టు నని పలికి.

677


చ.

జనకజఁ గాన కే నరుగఁ జండగతి ననుఁ బట్టి [1]గిట్టి త
ర్జన మొనరించి దండముల జర్జరితాంగునిఁ జేయుఁ గాన
నినజునిపొంతఁ బో వెఱతు నిక్కడఁ బ్రాణములం ద్యజించెదన్
వనచరులార మీ రటకు వాంఛలతోఁ జని యానతాంగు లై.

678


క.

ఏ నిట నీల్గుట విన్నన్, మానసమున దుఃఖ మొంది మరణం బొందుం
గాన మును దార మొగపడి, మానుగః గుశలంబు లడిగి మఱి నే ర్పమరన్.

679


వ.

నాతెఱం గెఱింగించి యంతమీఁద.

680


క.

పతియును సుతుఁడును లేమికిఁ, దతదుఃఖముఁ బొంచుజనినిఁ దారను మఱిస
మ్మతి రుమను శోక ముడుగఁగఁ, గృతిమతి బోధించి బుజ్జగింపుఁడు మీరల్.

681

ప్రాయోపవిష్టు లైన హనుమదాదులకడకు సంపాతి వచ్చుట

వ.

అని పలికి యంగదుండు భోజనంబు చేయుచు దర్భశయనుం డయ్యె నప్పుడు
సకలకపులు బాష్పధారలు దొరఁగ నంగదునిం దిరిగివచ్చి జలాచమనంబు చేసి
దక్షిణాగ్రంబు లైనదర్భలమీఁద నుత్తరశిరస్కులై ప్రాఙ్ముఖు లగుచుఁ బర్వత
సన్నిభు లైనయవ్వన చరు లొఱలుచుఁ బ్రాయోపవేశంబు చేసి రపుడు మందర
పర్వతవినిర్గతుం డై వింధ్యపర్వతశిఖరాగ్రంబున నున్నసంపాతి కడంక.

682


క.

తనబిలము వెడలి చేరువ, మునుమిడి ప్రాయోపవేశమును వరుసం గై
కొని వగలఁ బొగులుకపులం, గని యాసంపాతి యుత్సుకత ని ట్లనియెన్.

683


క.

దైవాధీనము లోకము, దైవము సర్వంబు భూతతతి కొడఁగూర్చుం
గావున నా కాహారము, దైవము ముందఱికిఁ దెచ్చి తనరఁగఁ బెట్టెన్.

684


క.

చిరకాలం బాహార, మ్మిరువుగఁ గొని తిరుగ లేని యే నింకను జె
చ్చెర ముందట మరణేచ్ఛా, పరు లై యీల్గువనచరుల భక్షింతు వెసన్.

685


చ.

అని విని యాత్మ దుఃఖపడి యంగదుఁ డిట్లను వాయుపుత్రుతో
మనల గ్రసించెదన్ వెసఁ గ్రమంబున నం చొకఘోరపక్షి యిం

  1. కట్టి భ
    ర్జన లొనరించి