పుట:భాస్కరరామాయణము.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని పలుకఁ గపులు తమలోన.

667


తే.

అంగదుఁడు చెప్పినట్ల యయ్యర్కసుతుఁడు
ఘనతరక్రూరుఁ డిక్కడికార్య మెఱుఁగఁ
డామహీజఁ గానక మన మటకు నేఁగఁ
గినిసి రామప్రియంబుగా మనలఁ జంపు.

668


సీ.

అని పల్క వారితో నంగదుఁ డిట్లను, మన మిఫ్టు వెడలిన ఘనబిలంబు
బహుపక్వఫలజలభరితంబు నేరికి, దుస్సాధతరమును దురధిగమము
మాయావినిర్మితమహితదేశముఁ గాన, క్రమ్మఱ నీగుహఁ గడఁక లారఁ
జొచ్చి కా పు౦డుద మిచ్చటఁ గపులార, యాబిలంబున మన మిప్పు డున్న
నింద్రుఁ డాదిగ దేవత లెల్ల వెదకి, మనలఁ గానంగ లే రన్న మనుజు లైన
రామలక్ష్మణులును మఱి రవిజముఖ్య, వానరప్రవరులు వచ్చి కానఁగలరె.

679


వ.

అని పలుకు నంగదువాక్యంబు లాదరింపక హనుమంతుం డి ట్లనియె నీవు వెడఁ
గుబుద్ధి వీకపులం గూర్చుకొని యీబిలంబు చొచ్చి ప్రబలుం డయినసుగ్రీవుతో
మరలంబడఁ జూచెదవు జను లెల్లఁ బ్రబలునిఁ జేపట్టుదురు గాని దుర్బలుని తెరు
వొల్లరు నేనును నీలుండును దాగుండును వాలి గలనాఁడు సుగ్రీవునివారలమై
యుండుదుము సుగ్రీవునిఁ బాసి మాకు నుండ నర్హంబు గాదు దక్కినవారును
జపలమతు లై యిక్కపులు దమతమపుత్రమిత్రకళత్రాదులం బాసి నీయాజ్ఞకు
లోనై నీకడ దుఃఖంబు లనుభవించుచుందురే మేమందఱముఁ దొలఁగిన నీవొక్క
రుండవు నీబిలంబున నెట్లుండెద వట్లుం గాక.

670


మ.

సురరా జుద్ధతి నొక్కవజ్రమున నీక్షోణీధ్రమున్ వ్రచ్చి క
న్దర మొక్కం డొనరించె లక్ష్మణునకు న్వజ్రోగ్రనారాచముల్
పరికింపం గల వెన్నియేని నతఁ డాబాణంబులన్ వీఁక ని
గ్గిరిఁ జూర్ణంబుగఁ జేసి నిన్నుఁ దునుముం గింకన్ మహోదగ్రుఁ డై.

671


వ.

కావున దుర్విచారంబులు మాని మమ్ము ముందట నిడుకొని సుగ్రీవునికడ కేఁగు
మతండు సత్యసంధుండును ధర్మయుక్తుండును మీతల్లి కత్యంతానురక్తుండు నగు
టం జేసి పుత్రుండ వైననిన్ను యుక్తక్రమంబునఁ బట్టంబు గట్టు బోదము రమ్మ
నుచుం బలుక నంగదుండు సుగ్రీవు నుద్దేశించి యిట్లనియె.

672


మ.

చన నీయంగదు యౌవరాజ్యయుతుఁ గా [1]సంప్రీతితోఁ జేయు మీ
తనికిం దప్పుట నాకుఁ దప్పు టని యుద్యత్ప్రీతితోఁ బంచినన్
సునయం బారఁగ రామునాజ్ఞ యువరాజుం జేసెఁ గా కిచ్చమైఁ
దనయంతన్ యువరాజుఁ జేసెనె ననున్ ధర్మంబు చెల్వారఁగన్.

673


చ.

అరుదారన్ గుహఁ జొచ్చి వాలి రిపుతో నా సన్నుఁ డై పోర ని

  1. .....జాలింపు సుగ్రీవ యీ
    తనికిం...