పుట:భాస్కరరామాయణము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గతసత్వవ్రాతమాంసగ్రసనవివృతవక్త్రప్రచండప్రచారుం
దతఘోరస్కంధు భూతత్రసనకరబలోద్యన్మదాంధుం దరక్షూ
ద్ధతదంతివ్యాఘ్రసింహాహరణనిపుణబాహాతిబంధుం గబంధున్.

385


వ.

అంత నారాఘవులు జంఘారహితకబంధుం డగునాకబంధుండు యోజనదీర్ఘంబు
లగుతనబాహువుల నిరువురం బొదివి సూర్యగ్రహణకరుం డగుగ్రహణగ్రహం
బునుంబోలె నాగ్రహం బొదవ నదల్చి వారి కి ట్లనియె.

386


సీ

అమ్ములు విండులు నడిదమ్ములును దాల్చి, యెటు వోయెదరు మీర లిపుడు నాదు
ఘనదీర్ఘతరభుజార్గళయుగ్మమునఁ జిక్కి, పొలిసితి రిం కెందుఁ బోవవచ్చు
నని యంటఁ బట్టిన నారామచంద్రుండు, ధైర్యధుర్యుఁడు గాన దలఁకకుండె
నప్పుడు లక్ష్మణుం డతిదుఃఖితాత్ముఁ డై, యవనీశ చిక్కితి మసురచేత
వీని కొకభంగి నను బలిగా నొనర్చి, నిన్ను విడుచు తెఱఁగు గోరి నిశ్చయింపు
మర్థి నిట్టైన బ్రదుకు దీ వైన నదియ, యనువు దలఁప మహాపద యైనయెడల.

387


మ.

అనినం దమ్మునిమాట దన్ను ఘనదుఃఖక్రాంతుఁగాఁ జేయ న
జ్జననాథుండు మహార్తిఁ బొందుచు ననున్ సౌమిత్రి యిబ్భంగి న
న్నును నిన్నున్ దనుజాధముం డొకఁ డదీనుం డై నిరోధించె నె
వ్వని నెబ్భంగుల నెట్లు సేయ దిల దైవం బెప్పు డేపట్టునన్.

388


సీ.

అనుచు శోకింపంగ నసుర వారిఁ దిగిచి, ఘనతరనిజవక్త్రగహ్వరంబు
చేరంగఁ దెచ్చుచో నారామచంద్రునిఁ, దప్పక కనుఁగొని తదనుజన్ముఁ
డి ట్లను నోరాఘవేశ్వర వీఁడు ని, రాయుధుఁ డని యవధ్యత్వబుద్ధిఁ
దెగ కున్కి నీయందుఁ దెల్ల మై తోఁచె నా, కతిపాపకర్ముఁ డీయధముఁ డేల
యీవిచారంబు వధియింపు మిపుడ యనుడుఁ, దెలిసి ఖడ్గంబు వెఱికి దైతేయుదీర్ఘ
కఠినభుజదండ ముగ్రవేగమున నఱకె, ననుజుఁ డట్టుల చేసెఁ దక్కినభుజంబు.

389