పుట:భాస్కరరామాయణము.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బునఁ గడఁగి భూతహింసన, మొనరింపఁగ నాగ్రహించె దుచితమె నీకున్.

339


క.

తరణికిఁ దేజంబు సుధా, కరునికిఁ గళ పవనునికిని గమనంబు వసుం
ధరకు ధృతి నైజ మనుగతి, నరనాయక నీకు దమము నైజగుణ మిలన్.

340


క.

సురగంధర్వప్రభృతులు, ధరణీశైలాపగాబ్ధిధాత్రీజాదుల్
నరవర నీ కేయపకృతి, యరయఁగ గావించె జగములం దెవ్వాఁడున్.

341


వ.

జనవర నీకు నప్రియంబు సేయంగలవాఁడు లేఁ డేనును నీవునుఁ గూడి యధిక
ప్రయత్నంబున గిరుల నదుల వనంబుల బిలంబులం గమలాకరంబుల సముద్రం
బుల దేవగంధర్వకిన్నరగరుడోరగామరలోకంబుల సర్వదిగంతంబుల వెదకి సీతా
పహరునిం గానకున్న మనకు దేవతలు వాని నప్పగింపకున్న మీఁద సచరాచ
రంబు లైనలోకంబుల నిర్ఘాతసంకాశబాణంబుల నిరవశేషంబుగాఁ జేయుదము
మొదట యుక్తక్రమంబున ధర్మంబు నడపి యటమీఁద రాజు నర్హదండక్ర
మంబున వర్తించు టొప్పు నని పలికి లక్ష్మణుండు మఱియు నిట్లనియె.

342


క.

ఆపద సమస్తలోకులఁ, బ్రాపించుఁ దొలంగు నపుడు పవనముభంగిం
బై పడునాపద సైఁచిన, భూపాలా క్షణములోనఁ బొందు శుభంబుల్.

343


వ.

రఘువరా యల్పతేజుం డైనసామాన్యుండు దుఃఖంబు సహింపనోపునె యార్తుం
డైననరునికి విజ్ఞానం బేల కలుగు నెవ్వం డాపన్నుండు గానివాఁడు గలండు న
హుషం డింద్రసాలోక్యంబు సెడి యధఃపతితుండు గాఁడె మహర్షిశ్రేష్ఠుం డైన
వసిష్ఠునికిఁ బుత్రశతంబు విశ్వామిత్రుచేత హతిం బొందదె లోకనేత్రంబు లైన
చంద్రమార్యులు రాహుగ్రస్తులు గారె సర్వభూతంబులు దేవాసురులు వినాశ
గతులు గారె కాన నినుబోఁటితత్త్వదర్శులు త త్త్వంబు బుద్ధిం దలపోసి ప్రా
జ్ఞు లై శుభాశుభంబు లొందినఁ బొంగక తలంకక సంతసింపక దుఃఖింపక ధీరు
లై యుండుదురు నీవు బృహస్పతిసమానబుద్ధిమంతుండపు నీయట్టియధికబలప
రాక్రమవిజ్ఞానగరిష్ఠుండు సీతానిమి త్తంబున నజ్ఞునిగతి నుండి దుఃఖించు టుచి
తం బగునే మన మెవ్విధంబున నేని సీతాపహరునిం బరిమార్చి పుణ్యసమేత యైన
సీత సాధించి తెత్త మనిన రాముం డనుజువాక్యంబులకు సంతసించి లోకంబుల
సంహరింప నెత్తిన కోపం బుడిపి యతని కి ట్లనియె.

344


క.

ఎక్కడ నున్నది జానకి, యెక్కడఁ బో నగును వెదక నేది యుపాయం
బక్కామినిఁ గన నెయ్యది, దక్కక సేయుదము సెపుమ తమ్ముఁడ నెమ్మిన్.

345