పుట:భాస్కరరామాయణము.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనిన సౌమిత్రి యన్నతో నిట్లను నీజనస్థానంబునం గలగిరిదుర్గవనబిలంబులు
నదులుం గిన్నరగంధర్వనిలయంబులుం ద్వరితగతి వెదకుదము నీయట్టి బుద్ధిసం
పన్ను లైననరో త్తము లాపదలకుం గంపింపరు వాయువేగంబునకుం జలియింపని
శైలంబులుంబోలె నని పలికిన లక్ష్మణసహితుం డై రాముం డాజనస్థానంబునం
గలయన్నిచోట్ల వెదకి సీతం గానక పాటోపంబునఁ జాపంబు గ్రహించుచు
నగ్రభాగంబున.

346

జటాయువు సీతావృత్తాంతము రాఘవులకుఁ జెప్పుట

క.

పక్షంబులు దెగి ఘోరా, జి క్షితిఁ బడి యున్నరక్తశసిక్తాంగు నుద
గ్రక్షోణిధరాకారునిఁ, బక్షీంద్రు జటాయువును నృపాలుఁడు గనియెన్.

347


వ.

కని రాముఁడు లక్ష్మణునితోడ.

348


ఉ.

వీఁ డొకరక్కసుం డెడరు వేచి మహీసుత మ్రింగి యిచ్చటన్
వాఁడిమి వాలుచున్ మనము వచ్చు టెఱింగి విహంగవేషి యై
పోఁడిగ నున్నవాఁ డనుజ భూరిపరాక్రమ మొప్ప వీనిఁ గ్రొ
వ్వాఁడిశరంబులం దునిమివైచెద నంచు మహోగ్రబాణమున్.

349


క.

వడిఁ గొని యేయం బూనినఁ, గడుభయమున రుధిరధార గ్రక్కుచు విభు న
ప్పుడు గని జటాయు వనుఁ గృప, యడరఁగ నోరామ రామ యార్తశరణ్యా.

350


క.

ఏను జటాయువ దశరథ, భూనాయకుసఖుఁడ రామభూవర మీరల్
లేనియెడ సీతఁ గొంచు ద, శాననుఁ డరుగంగ వాని నాఁగి కడంకన్.

361


ఉ.

ఏపున వానిఛత్రము మహీస్థలిఁ గూలిచి జోడు సించియుం
జాపము ద్రుంచివైచి బహుసాయకముల్ విదళించి వాజుల
న్రూ పడఁగించి తద్రథము నుగ్గుగ మోఁది నఖాళిఁ జంచుని