పుట:భాస్కరరామాయణము.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విస్మిత్యన్వితబాహుశౌర్యమున నుర్విం గూల్చి కల్పాంతకో
గ్రస్మర్తవ్యమహోద్ధతిన్ సకలలోకప్రాణులన్ ద్రుంచెదన్.

330


వ.

అని వెండియు.

331


మ.

ధరణీనందనఁ జూప కుండిన నమర్త్యశ్రేణి బాధించెనన్
వరుసన్ యక్షపిశాచరాక్షసచమూవర్గంబు నుగ్గాడెదం
బొరి గంధర్వుల సంహరించెద మహాభూతంబులం ద్రుంచెదన్
నరులం జంపెదఁ గిన్కఁ గిన్నరులఁ జండక్రీడఁ జెండాడెదన్.

332


చ.

వరుస నజాండభాండములు వ్రయ్యలుగా జలరాసు లింక భూ
ధరములు నుగ్గునూచముగ ధారుణి ధూళిపటంబు గాఁగ నం
బర మినచంద్రతారకసమాజముతో నిలఁ గుప్పఁ గూర ది
క్కరిశిరముల్ దెగంగఁ ద్రిజగంబులు చూర్ణము గాఁగఁ జేసెదన్.

333


ఉ.

అప్పుడు భీతిఁ బొంది కమలాసనముఖ్యులు సీతఁ దెచ్చి
కప్పన సేసి సమ్మదము నందుచు నేఁగెద రింకఁ జీవమైఁ
దప్పక చూడు నాబలము తమ్ముఁడ నీ వని పల్కి కన్నులన్
నిప్పులు రాలఁ గోపమున నిష్ఠుర చాపముఁ గేలఁ బూనినన్.

334


చ.

గగనము మ్రోసి బి ట్టవిసెఁత గన్కని నుల్కలు రాలె నెల్ల చో
దిగిభము లోలి వ్రాలె జగతీతల మల్లలనాడె నేడు పె
న్నగములు సంచలించె సురనాయకుఁ డాకులపాటు నొందె ము
జ్జగములుఁ దల్లడిల్లె రవించంద్రులు దప్పఁ జరించి రయ్యెడన్.

335


వ.

అప్పుడు సీతాహరణదుఃఖితుండును నతితప్తుండును నుష్ణదీర్ఘనిశ్వాసుండును నధి
జ్యశరాసనుండును నై లోకంబులు గాల్చు కాలాగ్నియుంబోలె దక్షాధ్వరధ్వం
సంబు సేయఁ బూనిన రుద్రుండునుంబోలె దుర్నిరీక్ష్యుం డై యున్న యన్నం
జూచి ప్రాంజలి యై వినయవాక్యంబుల సౌమిత్రి యిట్లనియె.

336


క.

లోకైకశరణ్యుండవు, లోకత్రాణుఁడవు సర్వలోకేశుఁడవున్
లోకహితంబుగ రాక్షస, లోకముఁ బరిమార్తు గాక లోకారాధ్యా.

337


క.

వికృతి యొనర్చినఖలుఁ ద, క్కక శిక్షింపంగఁ జంపఁ గర్తవ్యము గా
కొకఁ డపరాధము సేసిన, సకల జగత్త్రయముఁ జంప జనునే దేవా.

338


క.

మును నీవు భూతహితవ, ర్తనమునఁ బెంపొంది యిపుడు తద్దయు రోషం