పుట:భాస్కరరామాయణము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఆకాశం బలక్ష్యం బేరికిం బోరాదని పలికి.

317


క.

వైదేహిఁ గొంచు రక్కసుఁ, డేదిక్కున కరిగినాఁడొ యెంతయు వగతో
నాదిక్కున కేఁగఁగవలె, నేది యుపాయంబు మనకు నింకం జెపుమా.

318


వ.

అనవుడు లక్ష్మణుండు రామునితో ని ట్లనియె.

319


క.

అలఘుఁడు దుఃఖముఁ బొందిన, నలఁగక బుద్ధి ధృతిఁ బెంచునల్పుఁడు దుఃఖం
బలమిన ధృతి సెడి మునుఁగును, జలములలో శిలలు మునుఁగుచాడ్పున నధిపా.

320


క.

శోకముఁ బొందినవానిన్, భీకరరోగములు సెందుఁ బృథులార్థంబుల్
సేకుఱవు నాని కెప్పుడు, శోకము గని విడుచువాఁడు సుజ్ఞాని నృపా.

321


క.

ఓలిం గడు శోకించెద, వేలా యజ్ఞుగతిఁ గార్య మేమఱి యాప
త్కాలంబునఁ గార్యము సెడి, బాలిశుఁ డత్యంతశోకపరుఁడై పొలియున్.

322


వ.

నావుడు రాముండు లక్ష్మణుం గనుంగొని.

323


ఉ.

తమ్ముఁడ నీదువాక్యములు తప్పక సేసెద నంచుఁ బల్కి క్రౌ
ర్యమ్మున శాంతి వోవిడిచి యాగ్రహ మొందుచుఁ జంద్రికన్ వినా
శమ్ముగఁ జేసి మించు రవించందమునన్ వెలుఁ గొంది ఘోరకో
ప మ్మడరంగ రామజనపాలుఁడు లక్ష్మణుతోడ ని ట్లనున్.

324


ఉరుధర్మాన్వితుఁ డైనమజ్జనకునర్థోదారవాక్యమ్మునన్
ధరణీరాజ్యముఁ బాసి దీన యగుమాతన్ డించి యత్యంతభా
స్వరధర్మంబుఁ బురస్కరించుకొని యిచ్చన్ దండకారణ్యముం
బరఁగం జొచ్చియు ధర్మవృత్తిఁ దప మొప్పం బూని యే నుండఁగన్.

325


క.

సీత మృతిఁ బొందఁ జూచుచు, భూతంబు లుపేక్ష సేసె భూమీశులు నా
పూతవ్రతఁ గాచి ననుం, బ్రీతాత్మునిఁ జేయ రైరి పృథ్వీశసుతా.

326


క.

మృదువర్తనుఁ గరుణాన్విత, హృదయుని దాంతియుతు లోకకహితకరు నన్నుం
ద్రిదశేంద్రుఁడుఁ గరుణింపఁడు, మది దుర్బలుఁ డైనహీనమానవుఁ బోలెన్.

327


క.

ఏ ని ట్లాక్రోశింపఁగ, నూనినకృప నన్ను శోక మొందఁగ నేలా
మాను మన రెవ్వరును నా, జానకిఁ జూప రటు గాన సరభస మెసఁగన్.

328


క.

నాలలనఁ జూపకుండిన, నీలోకము లెల్లఁ ద్రుంతు నేకక్షణమున్
లోలాక్షిం బాసి మనం, గాలేను జగత్త్రయంబు గల్గిన నేలా.

329


శా.

అస్మచ్చాపవిముక్తబాణముల నుద్యద్భూతలం బంతయున్
భస్మీభూతము సేసి యిందుభగణప్రద్యోతనాకాశమున్