పుట:భాస్కరరామాయణము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రామిషమున్ గ్రహించి ముద మందుచుఁ బోయినవారు లక్ష్మణా.

281

రాముఁడు సీత నరణ్యంబులందు వెదకుట

వ.

అనుచు ననుజసమేతుం డై క్రోశమాత్రం బాశ్రమంబు గడచి రాముం డగ్రభా
గంబున నత్యద్భుతం బైనవిధ్వస్తధరణిపతితరణోపకరణంబులం బొడగని సౌ
మిత్రిం జూడు మని పలికి.

282


సీ.

కనకభూషితము ముక్తామణిసహితంబు, నగుభగ్నధను విదె యనుజ చూడు
శతశలాకము మాల్యచయశోభితవిభిన్న, దండము నగునెల్లి ధాత్రిఁ జూడు
బాలార్కసదృశంబు బంధురహైమంబు, వైదూర్యగుణరాజి వరుసఁ జూడు
మతివిశీర్ణము ధరాపతితంబు నగుతను, త్రము సూడు నుగ్గెనరథము సూడు
కనకవర్మముల్ ధరియించి ఘనపిశాచ, ముఖములును గల వేనడములు ధరిత్రిఁ
బడినవివె చూడు తపనీయబాణతతులు, నెరసియున్నవి దగఁ జూడు ధరణిఁ గలయ.

283


వ.

అని లక్ష్మణునకుం జూపి యంతరంగంబున.

284


క.

జనకజఁ బాసినదుఃఖం, బున కోర్వఁగఁ జాల కేను బొలిసి దివికి వే
చసిన ననుం గనుఁగొని మ, జ్జనకుఁడు మది రోసి లో నసమ్మతుఁ డగుచున్.

285


మ.

మునివృత్తిం బదునాలుగేం డ్లడవిలో మోదించి వర్తించెదం
జన నే నంచుఁ బ్రతిజ్ఞ నాయెదుర నిచ్చం జేసి యాకాల ము
ర్వి నొగిం బూర్ణముగాఁ జరింప కిటకున్ వీఁ డేటికిన్ వచ్చినాఁ
డని నన్నుం గడుఁ గామచారుఁ డనృతుం డత్యంతదోషుం డనున్.

286


మ.

హరిణాభేక్షణఁ గుంభికుంభకుచఁ బద్మాస్యం బికోదంచిత
స్వర బింబాధరఁ జారునీలకచపాశన్ సీత నీకాన భీ
కరశార్దూలమృగేంద్రకుంజరచరత్కాకోలరాజీశుకో
త్కరకేకివ్రజముల్ బహుక్రమములం గారించు భీతిల్లఁగన్.

287


తే.

అనుచు సీతఁ గానక మది వనటఁ బొందు, నన్నఁ జూచి లక్ష్మణుఁ డాత్మ ఖిన్నుఁ డగుచు
దేవ శోకంబు వలవదు దేవి నెల్ల, యెడల వెదకుద మని పల్కి యిట్టు లనియె.

288


క.

నలినికిఁ బోయెనో కానకు, నలరులు గోయంగ లీల నరిగెనొ వెన శై
వలినికిఁ జనియెనొ మనమన, ములు సూడఁగ డాఁగి యీరమున నున్నదియో.

289


క.

మనలన్ వెఱపింపఁగఁ గా, ననమున నున్నదియొ డాఁగి నవ్వులకై మా
టున నడఁగియుండఁ బోలును, జనకజ వెదకంగ మనము సనవలయు నృపా.

290


వ.

అని పలికి యన్నతోఁగూడ నొక్కకమలాకరంబు సేరి యప్పుడు.

291