పుట:భాస్కరరామాయణము.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అ ట్లేఁగి ముందట.

253

రాముఁడు పర్ణ శాలయందు సీతం గానక పలవించుట

సీ.

చంద్రిక లేనినిశాగగనముమాడ్కి, శారిక లేనిపంజరముకరణి
నలినసంతతి లేనికొలనికైవడి రేయి, దీపిక లేనిమందిరముపగిది
నూనైకఫలరాజి లేనియారామంబు, గతి నాస లేనివక్త్రంబుభంగిఁ
జెలఁగుకోయిల లేనియెలమావిచాడ్పున, నినదీప్తి లేనిదుర్దినమునట్లు
చారుమౌర్వి లేనిచాపదండమునోజ, లలితతండ్రి లేనియొళగుఁబోలె
నవనితనయ లేనియావాస మంతయుఁ, బాడువాఱి యుండఁ బార్థివుండు.

254


క.

ఉల్లము జ ల్లన దేహము, దిల్లవడఁగ దృతి దలంక దెప్పర మొందం
దల్లడముతోడ నుటజం, బెల్ల వెదకెఁ బ్రియను గాన కెంతయు భీతిన్.

255


క.

పొలఁతుక మెలఁగెడుచోట్లం, గలయంగా వెదకి యెచటఁ గానక కడువి
హ్వలుఁ డగుచుఁ బర్ణశాలకు, లలిఁ గ్రమ్మఱ వచ్చి చూచి లక్ష్మణుతోడన్.

256


తే.

తిరిగి వచ్చినచోటులు దెలివితోడఁ, గలయ వెదకియు నెచ్చటఁ గానలేక
పర్ణశాలలోపల లేదు బాల యంచుఁ, జెప్పి యధికాతురతభ్రాంతచిత్తుఁ డగుచు.

257


క.

ఏమెయి నడుగులు లేనిది, యేమరుదో పర్ణశాల యిది గాదొకొ మే
రాముఁడఁ గానో రాముఁడు, రామం బెడఁబాసి క్షణము బ్రతుకఁగఁ గలఁడే.

258


వ.

అని పలికి.

259


శా.

ఏమె ట్టీయది మెట్టు గా దిది వనం బే రాకుమారుండనో
సౌమిత్రీ విను నీవు రాముఁడవె వత్సా నిక్క మే రాముఁడన్