పుట:భాస్కరరామాయణము.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్సల రక్షింపుము వచ్చి న న్ననుచు నత్యార్తశ్రుతిం బల్కె న
వ్వల నే మయ్యెనో రాముఁ డావిభునిఁ గావన్ వేగ నీ వేఁగ వే
కలఁగంబాఱెడుఁ బ్రాణమున్ మనము శంకం బొందెడిం దమ్ముఁడా.

235


వ.

అని సీత పల్కిన నేఁ దలంకక భవత్సామర్థ్యంబు నుద్దేశించి యి ట్లంటి.

236


క.

అనిమిషులకు రక్షకుఁ డగు, మనుజేశ్వరుఁ డేల తనదుమానము సెడి న
న్నును రక్షింపుము లక్ష్మణ, యనునీకష్టంపుమాట లాడును దన్వీ.

237


క.

మూఁడుజగంబులలోపల, వాఁడిమగంటిమిఁ గడంగి వడి నాలమునన్
వేఁడిమితో మార్కొన నె, వ్వాఁ డోపును రామవిభుని వాసవశౌర్యున్.

238


క.

ఇది యొకరాక్షసకృత్యము, మది వెఱవకు మనుచు నెన్నిమాఱులు దర్పం
బొదవఁగఁ దను బోధించిన, హృదయము పదిలింపలేక యెడపనిచింతన్.

239


చ.

కనుఁగవ బాష్పముల్ దొరఁగ గద్గదకంఠముతోడ నేడ్చుచున్
మనమున దుఃఖ మొందుచును మానము దూలఁగ దీనవక్త్ర యై
ననుఁ బలుమాఱు నార్యనుత నావిభుఁ గావఁగఁ బోఁ గదయ్య నీ
వనుచు భయార్తితోఁ బలుక నజ్జనకాత్మజఁ జూచి వెండియున్.

240


క.

కన్నీ రేటికి నించెదు, విన్నఁదనం బేల నీకు వెఱ పేమిటికిన్
నన్నేటికిఁ బొ మ్మనియెదు, మున్నే మాయన్నశౌర్యమును నెఱుఁగ నొకో.

242


వ.

అని పలికిన నుపశమింపక రోపారుణనేత్ర యై నన్ను ని ట్లనియె.

243


తే.

అన్న యాపద నొందంగ నాత్మ నడల
నేను బనిచిన విభువెన్క నేఁగ మొగియ
వధిపునార్తఘోషము విని యటకు నరుగ
వగ్రజుని చేటు గోరి పో వచటి కీవు.

244


క.

పాయక పో నాఁ బోవవు, నాయెడ నేయెగ్గు దలఁచినాఁడవొ యిట భూ
నాయకుఁడు లేనిచోటను, దాయాదులచిత్తవృత్తి తగ వెట్టిదియో.

245


వ.

అని సీత న న్నచట నుండరాకుండ నిష్ఠురోక్తులు పల్కిన సైరింపలేక మిమ్ముం
గాన వచ్చితి ననిన రాముండు రోషించి లక్ష్మణుం గనుంగొని.

246

శ్రీరాముఁడు లక్ష్మణునితో సీత నొంటి విడిచి వచ్చినది త ప్పని చెప్పుట

ఉ.

చారుకులాభిమానమును సన్నుతధర్మము వీటిఁబుత్తురే