పుట:భాస్కరరామాయణము.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్తటిదావిర్భూతిభూతత్రసనముగ సభాస్థాన మెల్లం గలంగన్.

265


క.

కటములుఁ బెదవులు నాసా, పుటములు నదరంగ మేను పొరిఁ గంపింపం
జిటిలిపడి మండి యెవ్వం, డిటు నిన్నుం జేసె ననిన ని ట్లను నదియున్.

266


సీ.

రాముఁ డనఁగ నొక్కరాసుతుఁ డతివతో, ననుజసహాయుఁడై యరుగుదెంచి
దండకాటవి సొచ్చి తా నుండు నచ్చటి, కే నుండఁ బోయిన నిట్లు సేసెఁ
గడఁగి నాకై వచ్చి ఖరదూషణాదులు, పదునాల్గువేవురు ప్రధానభూమి
నతనిమహాస్త్రనలార్చుల మ్రందిరి, పలుమఱు వేయును బలుకు లేల
యక్షగంధర్వసిద్ధవిద్యాధరాది, సకలదివిజులతోఁ బగ సాలఁ గొనియు
నీవు రాజ్యమదంబున నిన్ను మఱచి, వేగు లరయింపకున్న నీకె వెతలు వచ్చె.

267


క.

దూరస్థు లయ్యుఁ గార్యము, చారులచేఁ గనుటఁ జారచక్షులు రాజుల్
వా రని చెప్పఁగ వినవె వి, చారము దోఁచునె కుమంత్రిసహితున కెందున్.

268


వ.

అని వెండియు.

269


శా.

ఏకాంగుష్ఠము నేల మోపి తప మట్లే నూఱువేలబ్దముల్
గోకర్ణాశ్రమవాసి వై సలిపి రక్షోనాథ యవ్వేధచే
నీకై కొన్నవరంబు లెన్నఁటికొకో నేఁ డిట్లు గా నాఁడు గ్రీ
వాకండూతికి వేల్చితో శిరములన్ వైశ్వానరజ్వాలలన్.

270


క.

బంధుజనక్షేమములు మ, దాంధుఁడ వై యరయ కునికి నపకీర్తి మరు
ద్గంధర్వాదులు నగ దశ, కంధర నినుఁ జెందె నేటి గర్వం బింకన్.

271


ఉ.

నా విని రాముఁ డెవ్వఁడు వనంబున కేటికి వచ్చినాఁడు యు
ద్ధావని నెట్టు లొక్కరుఁడ యట్టిఖరాదులఁ జంపె నెట్టివాఁ