Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లీకృతకోదండుం డగుచు విజృంభించి మఱియుఁ గాలపాశసంకాశంబు లగుననే
కశిలీముఖంబులు నిగిడింప నాకాశంబున ధూమాగ్నిపగిది మండుచు నడరి
వారి నానావిధంబుల వధియింప నయ్యాతుధానులు మెండుకొని వెండియుం బోవక.

216


క.

ఇషువులు గురియఁగ నారఘు, వృషభుం డని సైఁచి నిలిచె వెస నఫ్డు మహా
విషధరములు వర్షింపఁగ, వృషభంబు దలంక కున్నవిధ మొప్పారెన్.

217


ఆ.

ఇట్లు మెఱసి మెఱుఁగు లీనువాలమ్ములఁ బఱపి వివిధగతుల బారి సమర
సమర ముడిగి విగతశస్త్రు లై ధరణి గం, పింపఁ బాఱి రా నిలింపరిపులు.

218


ఉ.

అప్పుడు దూషణుండు వసుధాధిపునమ్ములచేతఁ బైపయిం
గుప్పలు గాఁగ రక్కసులు గూలినచందము చూచి కన్నులన్
నిప్పులు రాలఁ బెల్లడరి సింగిఁ జెలంగెడునార్పుతో వడిం
గప్పె నఖండచండతరకాండపరంపర నారఘూత్తమున్.

219


మ.

పెలుచం గప్పిన నన్నిశాచరున్ స్ఫీతాగ్నిపాతం బెదం
దలఁపింపం డగునస్త్రపంక్తిఁ గినుకం దా నేసె న ట్లేయ న
బ్బలుబాణంబుల కోర్చి వాఁడు మఱియుం బంటింప కాశీవిషో
జ్జ్వలశస్త్రంబు లనేకముల్ వఱపె నాక్ష్మాపాలుపై నేపునన్.

220


సీ.

పఱప నవ్వీరుండు పండ్రెండుకోలల, బ్రహ్మదండంబులపగిది వాని
నొక్కటఁ దొడిగి యం దొక్కటఁ బడగయు, నొకశరంబున విల్లు నొకట సూతు
మస్తకంబునుఁ జతుర్మార్గణి నరదంబు, మావుల రెంట మైమఱువు నొకట
నాతపత్రము రెండుశాతశరంబుల, ఘనరయంబునఁ ద్రుంచి మొనసి మఱియు
విస్ఫులింగతతులు వివిధముఖంబుల, వెడలునట్లు గాఁగ నడరుమెఱుఁగు
టంపగముల మిగులునన్నియు నఱికిన, నప్డు విరథుఁ డగుచు నవని కుఱికి.

221