పుట:భాస్కరరామాయణము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

[1]ఆసమయంబున.

167


శా.

రక్తాలక్తము లుర్విపై నెరయఁగా రాజన్యబాహాధను
ర్ముక్తక్రూరశిలీముఖంబు లడరం దోడ్తోడఁ దద్గాత్రముల్
రిక్తప్రాణము లైనఁ గన్గొని భయార్తిం గ్రమ్మఱం బాఱె నా
నక్తంచారిణి దిక్కులం జెలఁగ నానారోదనధ్వానముల్.

168


వ.

ఇత్తెఱంగునం బాఱి ఖరునిముందట నిలిచి పేరెలుంగున నేడ్చిన నతండు నచ్చె
రువందుచు నన్నిశాచరిం గనుంగొని.

169


మ.

పడతీ క్రమ్మఱ నేల యేడ్చెదవు నీబన్నంబు నీఁగం గడుం
గడిమిం బేర్చినవీరులం బనుపనే కార్యం బెఱింగింపు మూ
ఱడు శోకింపకు వారు వారి నని మీఱం బూని తా రేగి రే
ర్పడ దేచందము నీమనోరథము దీర్పం జాలలో వ్రేల్మిడిన్.

170


క.

అనవుడు నది యి ట్లను నీ, పనిచినయారజనిచరులఁ బదునలువురు న
మ్మనుజాగ్రణి యొక్కట వే, తునుమాడె నిశాతశరచతుర్దశకమునన్.

171


సీ.

ఇంక రక్కసు లెంద ఱేఁగిన మిడుతలు, కార్చిచ్చుపైఁ జన్నకరణి నతని
మార్గణార్చులఁ బడి మ్రంది పోఁగలవారు, గావున బాహువిక్రమము నెరయ
రాత్రించరేశ్వర రయమునఁ జని వారిఁ, బరిమార్చి నాపరిభవము నీఁగఁ
జాలవేనియు జనస్థానంబు విడిచి నీ, వెందేనిఁ బాఱి పొ మ్మిచట నునికి
పొసఁగ దే నిపుఁ డంతయుఁ బోల వింటి, రజనిచరవధార్థము దాశకరథులు వచ్చి
నారు మనచూచుసామాన్యనరులు గారు, వారు రామలక్ష్మణు లనుక వారు వినుము.


చ.

మగఁటిమి నేఁగి రాక్షసులు మగ్గిరి నీపెనుఁబ్రావు నమ్మి నా
పగకొఱ కైన నీవు నిజబాహుబలోద్ధతి మీఱి మార్కొనం

  1. 167 మొదలుకొని 189 వఱకుఁ గలపాఠమునకు మాఱుగా
    క. ఒక్కడ పదునలుగుర ని, ట్లక్కజముగఁ గూలి నిహతు లైనఁ దలఁకుతో
        ముక్కిఁడి రక్కపి పఱచెను, గ్రక్కున ఖరుఁ డున్నయెడకుఁ గడుశోకమునన్.
    చ. చని ఖరుముందటన్ ననుజసంఘము చూడఁగఁ గూలి రోరి నీ
         పనిచినవారు రాముపటుబాణములం బడి రోపితేని నీ
         పనికి నెదిర్చి రమ్ము ప్రథనాంతకు నారఘువీరుఁ బోరిలో
         బెనయఁగ నీవశంబె వెసఁ జేరుము లంకకు నొండె నావుడున్.
    ఉ. భీషణభంగిఁ బొంగి తను బిట్టుగఁ బల్కిన రోఁజుచున్ మహా
         రోషకఠోరవాక్యముఖరుండు ఖరుండు మహోగ్రఘోషణున్
         దూషణుఁ బిల్చి సైన్యములు దుర్దమలీల నమర్పు కింకిణీ
         భూషణశస్త్రవర్మరథభూరిమదద్విరదాదికంబుగన్.
    క. వాలినఘన సేనలఁ బదు, నాలుగువే లమరఁ బేర్చి నడపింపుము నా
          విలసితకుంతఘనకర, వాలాభీలముగ నొక్కవడి నని కడిమిన్.
    ఉ. ఏపున దండనాయికున కిమ్మెయిఁ జెప్పి యతండు మున్నుగా
         నాపదునాల్గువేలు దనుజాగ్రణులుం దనదోడ రా సమా
         టోప మెలర్చ నల్లన పటుత్వమునం దనతేరు గ్రాల ను
         ద్దీపితకోపుఁ డై ధను వుదీర్ణరుచి మెఱయంగ నుగ్రతన్.
    సీ. ఘనవిక్రములు సేనగామియఁ బురుషుఁడు, యజ్ఞశత్రుండు విహంగముండు
         కరవీరనేత్రుఁడు కాలకర్మకుఁడు మ, హాకపాలుఁడు రుధిరాశనుండు
         రక్తమాలియు ద్విశిరప్రభూతుండును, సర్వాననుండును జలదమాలి
         వజ్రఘోషుండును, వజ్రదంష్ట్రుండును, నగ్నినేత్రుండు బ్రహ్మాశనుండు
          హయముఖస్థూలనేత్రదుర్జయులు మఱియు, జంబుకాసురుఁడును బృథుశ్రావదూష
          ణాదిదైత్యులు గదిసి రా నమితగర్వ, పరుషభాషణపరుఁ డైనశిఖరుఁడు నడిచె.
    ఉ. అత్తఱి రాలెఁ జుక్క లరుణాభ్రము లెల్లెడఁ బెల్లు వన్ని క్రొ
          న్నెత్తురు నెమ్ములుం గురిసె నేల వడంకె సృగాలఘూకముల్
           మొత్తము గట్టి మ్రోసెఁ గడు మ్రొగ్గె హయాదులు వానిఁ జూచియుం
           జిత్తములం గలంగ కవి సేయఁ దొడంగిరి సంకటంబునన్.
    ఉ. పంచవటంబుకై నడువఁ బంచె నుదంచితలీల సేన న
         క్తంచరకోటి దోఁచుటకుఁ దాఁ గర మొప్ప నిమిత్తభంగు లూ
         హించి సుమిత్రపట్టికి నరేంద్రుఁడు ఘోరరణంబు గల్గు నేఁ
         డం చట పల్క దక్షిణమునం దట పర్వె ధరాపరాగముల్.
    మ. కని కాకుత్స్థవరుండు లక్ష్మణునితోఁ గంటే మహోత్సాహవ
          ర్ధనదుర్వారగజేంద్రవాహభటబృందవ్యూహసేనాప్రవా
          హనిశాటేశచమూప మాహవసమీహాలోలమై వచ్చె నీ
          దనుజవ్రాతము నేన త్రుంచెద మహీధ్రం బెక్కి నీ వక్కడన్.
    క. సీతారక్షణతత్పర, చేతోగతి నుండు చనుము శీఘ్రము మదిలో
          భీతహరిణాక్షి దైత్య, వ్రాతము గని వెఱచు ననిన వడిఁ జని యతఁడున్.