పుట:భాస్కరరామాయణము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చుందు రంతఁ గతిపయదినంబులకు విశ్వామిత్రసహితుం డయి యిమ్మహాభా
గుం డేఁగుదెంచి దశరథసఖుం డైనమజ్జనకునకు నమస్కరించినం గుశలం బడిగిన
యనంతరంబ యుచితకథాప్రసంగంబు లాడి మంత్రులం గనుంగొని.

315


ఉ.

ఒక్కశరాసనంబు వినియుండుదు మిచ్చట నెట్టిచాపమో
యె క్కిడఁ దివ్వ లోకమున నేరికి రాదఁట చూచువేడ్క మా
కెక్కుడు నావుడున్ విని నరేంద్రుఁడు సంతస మంది మంత్రులుం
దక్కినబంధులోకము ముదంబునఁ బొందఁగ నీరఘూత్తమున్.

316


ఉ.

తోడ్కొని వచ్చి శక్రగజతుండమహాపరిఘాభిరామ మై
చూడ్కికి వింత యైనవిలు చూపుడు నయ్యురుశింజినీకమున్
వేడ్కయుఁబోలె లీల రఘువీరుఁడు దాపలికేల నెత్తె న
మ్మాడ్కి ధరింప నెవ్వరికి మానము గానిధనుర్లలామమున్.

317


తే.

ఎత్తి చూపఱు వెఱఁగంద నెక్కు ద్రోచి, వేడ్కఁ దెగ దివ్వ నవ్విల్లు విఱుగుచప్పు
డశనిగతి యైన మూర్ఛిల్లి రచటిజనులు, జనకకౌశికరామలకక్ష్మణులు దక్క.

318


వ.

తదనంతరంబ మాతండ్రి సంతోషంబునం బొదలి రఘుపతిభుజబలంబు ప్రశంసిం
చి నీ వింక నిక్కన్యం బరిగ్రహింపు మని పలికిన దశరథానుమతంబు వలయు
ననుటయు నమ్మహీపతి రావించి న న్నీరాజన్యునకు ధర్మపత్నిం జేసి నాచెలియలి
నూర్మిళ నీసుమిత్రాపుత్రునకు నిచ్చె నని యిట్లు స్వయంవరప్రకారంబు సెప్పిన
నమ్మునిపత్ని సీతపలుకు లాలించి పదంపడి భానుమండలం బపరశిఖరిశిఖరతిరో
హితం బగుటయుఁ గనుంగొని.

319


చ.

చెలఁగఁ దొడంగె నీడములఁ జేరి విహంగము లాశ్రమాంఘ్రిపం
బుల కుదకంబు వోసి మునిపుత్రులు వచ్చెద రోలి వేదికా
తలములఁ బొందెడున్ మృగవితానము లబ్దిని నిద్ర వొందెడిం
దెలువుల మ్రింగుచుం దమము దిక్కులఁ గప్పెడి నంత కంతకున్.

320


క.

కలయ నిశాచరసత్త్వం, బులు దిరిగెడు హోమధూమపుణ్యామోదా
మిళితానిలములు మెలఁగెడు, వెలిఁగెడుఁ జుక్కలును దోఁచె విధుమండలమున్.

321


ఉ.

ఇంక లతాంగి రాముకడ కేను గనుంగొనుచుండఁ గుంకుమా
లంకృత వై వినూతనవిలాసముతోఁ జను మన్న నంగరా
గాంకితకాంతి నొ ప్పెసఁగి యమ్మునిపత్నియుఁ జూచుచుండ న
ప్పంకరుహాక్షి వచ్చి జనపాలున కంతతెఱంగు చెప్పినన్.

322


క.

విని సతి నవసౌందర్యముఁ, గనుఁగొని మది నలరి నృపశిఖామణి యయ్యా
మిని నచటఁ బుచ్చి వేగినఁ, జనుదెంచి కృతాగ్నిహోత్రసమయం బయినన్.

323


చ.

మునిచరణాంబుజంబులకు మ్రొక్కిన దీవన లిచ్చి తండ్రి యి
వ్వనభువి ఘోరరాక్షసు లవారితు లై చరియింతు రిత్తపో