ఉ. | సారకథాసుధారస మజస్రము నాగళపూరితంబుగా | |
చ. | ఉభయకవిత్వతత్త్వవిభవోజ్జ్వలు సద్విహితాధ్వరక్రియా | |
అని నన్నయ్యతిక్కనలను మాత్రమే స్తుతించియున్నాఁడు. మారనకు సమీపకాలపువాఁ డయినమడికి సింగనయు
| సారమతిన్ భజింతు ననిశంబును నన్నయతిక్కనార్యులన్ | |
అని యాయిరువురనే పేర్కొనియున్నాఁడు. ఈతనికిఁ దరువాతివాఁ డగు నెఱ్ఱనయు నాయిద్దఱుకవులనే స్తుతించియున్నాఁడు. తిక్కన 'సారకవితాభిరాముఁ' డనుటం బట్టియుఁ, గేతన దశకుమారచరితమునందు
శా. | శాపానుగ్రహశక్తియుక్తుఁ డమలాచారుండు సాహిత్యవి | |
అని 'శాపానుగ్రహశక్తియుక్తుఁడు' గను 'సాహిత్యవిద్యాపారీణుఁడు' గను జెప్పి యుండుటంబట్టియు, మంత్రిభాస్కరుఁడు మంచికవి గావచ్చును గాని కవిస్తుతుల కెక్కు నంతటి మహాకవి గాఁడని తెలియుచున్నది. మఱియుఁ గేతన యతని నట్లు వర్ణించియు రామాయణమును రచించినట్లు చెప్పమిచే దాని నతఁడు రచింపలేదనియుఁ దేటపడుచున్నది.
[1]ఇది యిట్లుండఁ దిక్కనశిష్యుఁ డయిన మారననుబట్టి తిక్కనకాలము మఱింత నిర్ణీతముగాఁ దెలియుచున్నది. మారన 1295 వ సం॥ మొదలుకొని 1323 సం॥ వఱకుఁ బరిపాలనము చేసిన రెండవప్రతాపరుద్రుని సేనాపతులలో నొక్కండగు నాగయగన్నమంత్రికిఁ దన విష్ణుపురాణము నంకితము చేసియున్నాఁడు. కనుక మారనగురుం డయినతిక్కన 1290 వ సం॥వఱకు జీవించి యుండవచ్చును. దీనింబట్టి చూడఁగా 'అంబరవిశశి' యను పద్యము మొదలయినవి యవిశ్వసనీయములుగాఁ జూపట్టుచున్నవి. తిక్కన యీకాలముంబట్టి మంత్రిభాస్కరుఁడు పండ్రెండవశతాబ్దముతుదివాఁ డని తెలియుచున్నది. దీనింబట్టి చూచినను మంత్రి
- ↑ కవులచరిత్రము భాస్కరోదంతము మొదలగువానినుండి యిందలివిషయములు కొన్ని గయికొనంబడినవి, విజ్ఞానచంద్రికవారి 'ఆంధ్రుల చరిత్రము' నుండియుఁ గొన్నివిషయములు గ్రహింపబడినవి.