పుట:భాస్కరరామాయణము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామచంద్రుండు దశరథునకుఁ దిలోదకాదు లిచ్చుట

వ.

అనిన విని డగ్గుత్తిక పెట్టుచు దేవా మీరు విచ్చేసిన యేడవదివసంబున భవద్వి
యోగశోకాతురుం డయి భూలోకపతి లోకాంతరంబు నొందె నని పల్కుటయు
నప్పలుకు లశనిపాతఘోషంబునం బోలెఁ గర్ణపథంబునం బడిన రామచంద్రుం
డు మూర్ఛాపరవశుం డయ్యె జనకరాజపుత్రియు సౌమిత్రియు మృతిఁ బొందిన
య ట్లుండి రంతఁ గొంతదడవునకుం దెలిసి లక్ష్మణాగ్రజుం డనేకప్రకారంబుల
విలపింపం గనుంగొని.

259


క.

భరతుం డి ట్లనియె నరే, శ్వర ప్రాకృతునట్ల తాల్మి వ్రయ్యఁగ శోకా
తురతం బొందక ధర్మ, స్థిరతం బితృఋణము నీవు దీర్పఁగవలయున్.

260


వ.

అనినం దెలివొంది మందాకినియందు సీతాలక్ష్మణసమేతంబుగా స్నానంబు లాచ
రించి తిలోదకంబు లిడి విహితద్వాదశాహకృత్యంబులు నడపి బదరీఫలమిశ్రి
తంబు లగునింగుదీయవపిణ్యాకంబులం బిండంబులు పెట్టి కృతకృత్యతం బొంది పర్ణ
శాల కేతెంచి తమ్ములం బట్టికొని రోదనంబు సేయఁ జిత్రకూటాశ్రయు లైనము
నులును యక్షగంధర్వకిన్నరకింపురుషులు నేఁగుదెంచి వారిశోకంబులు వారించి
రాసమయంబున వసిష్ఠుండు కౌసల్యాదిమాతలం దోడ్కొని వచ్చిన వసుధాపు
త్రీసమేతుం డయి రఘువరేణ్యుండు సవిత్రులయడుగులం బడి దెస లద్రువ రో
దనంబు సేయుటయు నచ్చటియతులధృతులు గలంగెఁ గౌసల్య కొడుకులం గోడలి
నెత్తి కౌఁగిలించుకొని యత్తలోదరితో రోదనంబు సేయ నచ్చట నున్న గరుడ
గంధర్వకిన్నరకంపురుషాదికాంతలు దురంతదుఃఖంబులం బొగులుచున్న సీతం
గనుంగొని.

261


జనకుండు తండ్రి దశరథ, జననాథుఁడు మామ రామచంద్రుఁడు విభుఁ డ
య్యును నీయబల విపద్భా, జన మైనది దైవగతి కసాధ్యము గలదే.

262


క.

అని శోకించుచుఁ గైకం, గనుఁగొని యిప్పాపజాతికారణమున ని
వ్వనితారత్నమునకు ని, వ్వనవాసాయాస మొందవలసె నటంచున్.

263


వ.

పలుకుచుండి రనంతరంబ వసిష్ఠువచనంబుల వారు శోకం బుడిగి చిత్రకూటా
చలవాసు లగుమునీంద్రకిన్నరకింపురుషగరుడగంధర్వవిద్యాధరులతోడ యథో
చితాసనంబులం గొలువుండి రప్పుడు సభామధ్యంబున నున్నయన్న నవలోకించి
కేలు మొగిచి భరతుం డి ట్లనియె.

264


సీ.

ఒకపాము మోపంగ నోపునా భూమిని, బార్థివుముంజేతిబలిమి గాక
యిల కెల్ల దలదండ చెలియలికట్టయే, రాజాజ్ఞ నబ్ధిపై రాదు గాక
వేదంబులా వర్ణవృత్తి కాధారంబు, జనపతిపాలనశక్తి గాక
యినరశ్ములా వెలుం గీలోకమున కీశు, దీప్రతేజోదీపదీప్తి గాక
గొడుగు విఱిగిన ధారుణి గూలు నబ్ధి, మేర దప్పు వర్ణాశ్రమాచార మడఁగుఁ