పుట:భాస్కరరామాయణము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తండ్రిపనువు నెఱపఁ దపసి యై యడవికి, నేఁగి యున్న రాఘవేంద్రువెనుక
సకలసేనతోడఁ జనుదెంచుచున్నాఁడ, వింత సేయ నాతఁ డేమి సేసె.

244


ఉ.

తమ్ముఁడుఁ దాను నొంటిఁ బడి తాపసు లై వనభూమి నుండఁగా
నిమ్ములఁ గిట్టి పట్టి వధియింపఁగఁ బోవుచునున్నవాఁడ వా
యమ్మకుఁ బుట్టినాఁడ వఁట యక్కట నీతలఁ పేమి సెప్ప ని
న్నిమ్మొనతోడఁ బో విడుచునే గుహుఁ డిప్పుడు సూడు మంతయున్.

245


క.

నీసేన విఱిగి పోవఁగ, నాసురగతి నెత్రువఱద లడరఁగఁ బటుబా
ణాసారము చూపెద బా, ణాసన మనుఘోష భీషణాభ్రమువలనన్.

246


తే.

ఏను సమసినవెనుక నీ వేఱు దాఁటు, మనినరోషోక్తులకు నస్మితాస్యుఁ డగుచు
రాముఁ బట్టముఁ గట్టఁ గిరాతనాథ, తోడితేఁబోయెదను గాని ద్రోహిఁ గాను.

247


వ.

అనిన విని సంతోషించి గుహుండు మ్రొక్కి రామచంద్రుండు విడిసినయింగుదీ
తరువును బర్ణతల్పంబును జడలు ధరించినచోటునుం జూప భరతుండు సూచి
విలపించుచుఁ బదంపడి శత్రుఘ్నసమేతుం డయి తానును జటాభారంబు గై
కొని గంగాతరంగణి దాఁటి యక్కిరాతపతిచేతఁ ద్రోవఁ జూపించుకొనుచు
నతని వీడ్కొని భరద్వాజాశ్రమంబునకుం జని యమ్మునీంద్రునకు నమస్కరిం
చుటయుం గోపంబున నత్తాపసోత్తముం డిట్లనియె.

248


శా.

క్షోణీరాజ్యము నీకు నిచ్చి ముని యై ఘోరాటవీవాటి న
క్షీణక్షాంతి వహించి యుండఁగ మహాసేనాసమేతుండ వై
ప్రాణ ద్రోహము సేయ నేఁగెదవొకో పాపాత్మ యి ట్లాజగ
త్రాణుం డల్పుఁడె కైక తల్లియఁట నిందం బొంద నీ వోడుదే.

249


చ.

అనవుడు నప్పు డాభరతుఁ డమ్మునిపుంగవుకోపచిహ్నముల్
గనుఁగొని భీతుఁ డై నృపశిఖామణి రామునిఁ దోడి తెచ్చి భూ
వనితకు నాథుఁ జేయుటకు వచ్చుట గా కిటు ద్రోహచింత నా
మనమున లేదు నాకు నిట మార్గము సూపు తపోధనోత్తమా.

250


తే.

అనిన ముద మంది మునినాథుఁ డతనిఁ గాంచి
తగినవిందులు నేయ నద్దాశరథియుఁ
జిక్కి యారాత్రి మఱునాఁడు చిత్రకూట
శిఖరితెరువు భరద్వాజుచేత నెఱిఁగి.

251


వ.

అమ్మునీంద్రు వీడ్కొని చనియె నంత నక్కడ సీతాసమేతుం డై రామచంద్రుండు
చిత్రకూటాద్రియందు విహరించుచుండి తత్సేనాకలకలంబునకు బెదరి కనుకనిం
బాఱుగజమహిషవరాహశార్దూలాదిమృగంబులం జూచి యవ్వల నాలోకించి
ధరాపరాగపటలంబునుం గాంచి లక్ష్మణా యిది యేమొకో మృగంబు లాకులార్త
రవంబులతోడం బఱవం దొడంగె నద్దిక్కునం బెంధూళి యెగసెం జూడు మన