పుట:భాస్కరరామాయణము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నప్పలుకులు నాకిటం బొంచి వినుచున్న మంథర నంతఃపురకాంతలు శత్రుఘ్ను
నకుం జూపి దీని దుర్మంత్రంబున నీయనర్థంబు లిన్నియుం బాటిల్లె ననవుడు
నతండు రోషావిష్టుం డగుచుఁ బెలుచ దానిం బడఁదాఁచి కేలం గడకాలు వట్టి
మీఁది కెత్తి జిఱజిఱం ద్రిప్పి నేలతో వేసి ఖడ్గంబు దిగిచి యంకించుచుం దొలం
గుం డిద్దురాత్మురాలితల ద్రుంచెద ననుచుఁ గైకకుం గవిసినం దత్పరిచారికలు
వాఱి కౌసల్యాదేవిమఱువు సొచ్చి రప్పు డాభరతుం డోహో శత్రుఘ్న
మన మీపాపజాతిం జంపిన మాతృహంత లని రామచంద్రుండు మనమొగంబులు
సూడండు గావున నీపుణ్యహీన తనదురితంబునఁ దాన పోవుంగాక దాసీవధం
బును నర్హంబు గాదు దీన నేమి గలుగుఁ బోవ ని మ్మనుచు నలుక వారించి య
తం డనుజసహితంబుగాఁ బోయి కౌసల్యాసుమిత్రలయడుగులం బడి రోదనంబు
సేయుటయు నయ్యగ్రసవిత్రియుఁ బుత్రులం గనుంగొని.

232


తే.

భరత మీతల్లి పతి బందెవట్టి నీకు, రాజ్యపట్టంబునకు వేఁడి రాము నడవి
కనిచెఁ దద్వియోగమున గతాసుఁ డయ్యె, నృపుఁడు నీ వింక నెమ్మది నేల యేలు.

233


సీ.

అనవుడుఁ గడు నొచ్చి యతఁడు గౌసల్యతో, నారామునకు ద్రోహి నైతినేని
నభిషేకలక్ష్మికి నాస సేసితినేనిఁ, గైక గావించిన కపటకర్మ
విధ మెఱింగితినేని విప్రుఁ జంపినవాని, గతికి గుర్వంగనాగామిగతికిఁ
గల్లు ద్రావినవానిగతికి సువర్ణాపహరణంబు సేసిన యతనిగతికి
భండనమున నోడి పాఱిన యాపంద, గతికిఁ బోదు నాదుకడిఁది శపథ
ములకు సాక్షు లఖిలమునులు దివ్యులు భూజ, లానిలాంబరానలార్కశశులు.

234


వ.

అని పలికినం బృథివ్యాదిమహాభూతంబు లితనిపలుకులు సత్యంబు లనునెలుం
గులం జెలంగెఁ గౌసల్యాసుమిత్ర లప్పు డప్పుత్రులం బట్టుకొని సంకులాక్రంద
నంబులు సేయ నప్పుడు వసిష్ఠుండు వారి వారించి యంతఃపురంబునకుం దోడ్కొ
నిపోవుటయు నప్పు డక్కుమారులుం దండ్రికళేబరంబు సూచి మూర్ఛ వొంది
వసుంధరం బడి రంతఁ గొంతసేపునకుఁ దెలివొంది భరతుం డెలుఁగెత్తి యోరా
జకుంజర యోదివాకరాన్వయరత్నాకరసుధాకర యోదశరథేశ్వర కేకయరాజు
మీకుఁ బుత్తెంచినభూషణంబులు దెచ్చినాఁడ వీని నేల కైకొనవు నాతోడం
బలుక వేను గైకకొడుకఁ గాన సంభాషణార్హుండఁ గానో యిదె చూడు శత్రు
ఘ్నుండు ధరిత్రిం బడి పొరలుచు ధూళిధూసరితాంగుం డయి యున్నవాఁ డితని
నాలింగనంబు సేసి లీలం గేల సమ్మార్జనంబు సేయ వేల నేము రామునకు ద్రోహు
లము గా మేల యనాదరణీయుల మయితి మనుచుం బనవి పనవి హాహాకారంబు
లెసఁగ రోదనంబు సేయ ననేకభంగుల బోధించి యాసమయంబున.

236


తే

భరతుఁ జూచి యారఘువంశగురుఁడు నీవు, తండ్రి కగ్నిసంస్కారాదితంత్ర మింక
ననఘ నడపంగవలయు శాస్త్రార్థసరణి, ననుడు నగుఁ గాక యని లక్ష్మణాగ్రజుండు.

237