పుట:భాస్కరరామాయణము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నకుఁ జనుదెంచి వసిష్ఠపుత్రుం డైనసుయజ్ఞునకుఁ బదికోట్లసువర్ణంబులు ననేక
రత్నాంబరంబులును సమర్పించి వసిష్ఠాదిమునులకు నానాదీనజనంబులకు సమ
స్తధనంబు లిచ్చె నంత జనకాత్మజయు నాత్మీయమందిరంబున కేతెంచి భూష
ణంబులు హేమరాసులును వసిష్ఠవాసిష్ఠపత్నుల కొసంగె నాసమయంబున
నరుంధతి వసిష్ఠుం గనుంగొని.

103


తే.

నీ కుపేక్షింపఁ దగునె యిక్ష్వాకుకులము, లోన నింతలు నొప్పము లైనచోట
ననిన నమ్ముని యధికసమాధియుక్తి, నయ్యనాగతవృత్తాంత మరసి చూచి.

104


వ.

ఇది దైవికం బయినతెఱంగు దీనిం గనుంగొనుచు నూరకుండు మని పలికె
నప్పు డారామచంద్రుండు సమస్తమునులకు గృహదేవతలకు నమస్కరించి శర
శరాసనసన్నద్ధుం డయి నగరు వెడలి చనిన జననులయార్తరావంబు వీతెంచె
నపుడు దశరథుండు శోకవివశుఁ డగుచు సుమంత్రుం గనుంగొని.

105

సీతారామలక్ష్మణులు వనంబున కరుఁగఁ బౌరులు వెంబడించుట

తరల.

రథము వే కొనిపొమ్ము రాముఁ డరణ్యభూమికి నేఁగెడున్
శిధిలతం ధనువల్లి దూలఁగ సీత మెల్లన పాదముల్
పృథివి మోపుచు నింత కెంత చలించుచుండునో నావుడుం
బృథులరత్నమరీచు లార గభీరనేమిరవంబుతోన్.

106


ఉ.

అతఁడు తేరు దెచ్చి వసుధాధిపునానతి రత్నకాంచన
స్ఫీతరథాధిరోహణము సేయుఁడు నావుడు సీతయున్ సుమి
త్రాతనయుండుఁ దానును రథంబు రఘూద్వహుఁ డెక్కి పోవ నా
నాతురనాదముల్ సెలఁగె నప్పుడు తత్పురిరాజవీథులన్.

107


వ.

మఱియు.

108


ఉ.

కొందఱు కైక నాడ నృపుఁ గొందఱు పేర్కొని యెగ్గు లెన్నఁగాఁ
గొందఱు రామచంద్రుఁ దనకుం జన నేటికి నాఁగ మంథరం
గొందఱు తిట్టఁగా సొలసి కొండఱు దైవము దూఱ రాఘవ
స్యందన వీథి నిట్లు జన శబ్దపరంపర నిండె వెండియున్.

109


వ.

మఱియుం బెక్కుదెఱంగుల.

110


మ.

కులనిస్తారకుఁ డీతఁ డిట్లరుగఁ గాకుత్స్థాన్వయం బింతతో
బొలిసెన్ మంథర యింత సేసె నది దుర్బోధంబుగాఁ జూడ కి
మ్ముల నక్కైకయు నావరంబు లడిగెన్ మోహాంధుఁ డై రాజు ను
గ్మలికిం బాపసహాయుఁ డయ్యె నకటా కౌసల్యకుం బండెఁ బో.

111


సీ.

సంతానసిద్ధికి సకలమునీంద్రులఁ, బితృదేవగణములఁ బ్రీతిఁ గొలిచి
బహుకాలతపమునఁ బరిపక్వ మగు పుణ్య, ఫలమునఁ గశ్యపబ్రహ్మమనుమఁ
డశ్వమేధంబున నధ్వర్యుఁ డయి పుత్ర, కామేష్టి గావింపఁగాఁ బ్రసక్తి