పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


దశ నుండి బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ విముకక్తిపోరాట నాయకునిగా గుర్తించబడ్డారు . ఆ కుటుంబంలోకి ప్రవేశించిన అంజాది బేగం అతి త్వరలో ఆ కుటుంబం అనుసరిస్తున్న ధార్మిక, రాజకీయ మార్గంలో పయనించటం ఆరంభించారు. ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యామం ద్వారా ఆమె మహాత్మా గాంధీ మార్గాన బ్రిటిష్‌ వ్యతిరేకతపోరాటంలో ప్రవేశించారు.

అలీఘర్‌లో చదువు పూర్తయ్యాక లండన్‌ చదువులు పూర్తిచేసుకుని ఇండియా తిరిగి వచ్చిన ముహమ్మద్‌ అలీ రాంపూరు, బరోడా సంస్థానంలో ఉన్నత ఉద్యోగాలుచేసి, స్వాచ్ఛకు ప్రతిబంధకంగా నిలచిన ఆ ఉద్యోగాలను విడిచి చివరకు జర్నలిస్టుగాకామ్రేడ్‌ అను ఉర్దూ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక ద్వారా ప్రజలలో జాతీయభావాలను ప్రోదిచేస్తూ, హిందు-ముస్లింల ఐక్యతను ప్రబోధిస్తూ, బ్రిటిష్‌ వ్యతిరేకతను ప్రజలలో పురికొల్పసాగారు. ఆ సందర్బంగా అంజాది బేగం భర్త అభిప్రాయాలకు మద్దతు తెలుపుతూ పూర్తి సహకారం అందిస్తూ ఆయనను ప్రోత్సహించారు.

ఖిలాఫత్‌ -సహయనిరాకరణ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ ఉద్యామ వ్యాప్తికి అత్తగారు బీబీఅమ్మ, భర్త మౌలానా ముహమ్మద్‌ అలీతో కలసి పలు పర్యటనలు చేశారు. ఆ సందార్బంగాప్రజల మనస్సులను ప్రబావితం చేయగల సంకిప్త ప్రసంగాలతో కార్యకరలను కార్యోన్ముఖులను చేశారు. ప్రముఖులను కలసి, ప్రజలను సమీకరించి ఉద్యామ స్వరూపం, ఉద్యామలక్ష్యం, ఉద్యామ విధివిధానాలను వివరిస్తూ ప్రసంగించటంలో ఆమె మంచి ప్రతిభచూపారు. సంక్షిప్త ప్రసంగాలు చేస్తూ మంచి వక్తగా ఆమె ఖ్యాతిగాంచారు. ఈ విధంగా అంజాది బేగం ప్రసంగాలు ప్రజలను ఉతేజితులను గావించడవుే కాక గాంధీజీ ప్రశంసలు కూడ అందుకున్నాయి. 1921 నవంబరు 29 నాటి యంఘ్‌ ఇండియా పత్రికలో సాహస మహిళ అను శీర్షికన ప్రచురించిన వ్యాసంలో గాంధీజీ ఆమె ప్రసంగాలను ప్రస్తావిస్తూ ఆమెమొదట ముస్లిం మహిళలను ఉదేశించి ప్రసంగించటం ప్రారంభించారు. ఆమె ప్రసంగం ఆమె భర్త మౌలానా ముహమ్మద్‌ అలీ ప్రసంగానికి ఏమాత్రం తీసిపోదని పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను. ఆమెది చిన్నపాటి ప్రసంగం అయినా నేరుగా ప్రజల హృదయాలను తాకి అధిక ప్రభావాన్ని చూపుతుంది. అత్యంత తక్కువ మాటలతో అత్యధిక భావాన్ని

140