పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


అందించగల ఈ కళను తన భర్తకు ఆమె నేర్పగలదా లేదా అను విషయం గురించి నేనేమీ చెప్పలేను అని రాశారు.

ఈ ఉద్యమంలో భాగంగా మహాత్ముడు నిర్దేశించిన సత్యాగ్రహ ఆందోళనను విజయవంతం చేయడనికి ఆమె శక్తివంచన లేకుండ పనిచేశారు. ఖిలాఫత్‌ కమిటీ-కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయం మేరకు విదేశీవస్తువుల బహిష్క రణ, మధ్యాపాన నిషేధాం,బ్రిటీష్‌ సైన్యంలో ఉద్యోగాలను, ప్రభుత్వపదవులను, ప్రభుత్వ కళాశాల లను త్యజించటం తదితర కార్యకలాపాల అమలు దిశగా ప్రజలను ప్రేరేపించేందాుకు ఆమె నడుంకట్టారు.ప్రజలను ప్రధానంగా మహిళలను సత్యాగ్రహాందోళన దిశగా ఆకర్షించేందు కు అత్తగారు ఆబాది బానో బేగంతో, భర్త మౌలానా ముహమ్మద్‌ అలీతో కలిసి పలుచోట్ల పర్యటించారు.


ఖిలాఫత్‌:- సహాయ నిరాకరణ ఉద్యమానికి అవసరమగు నిదులను సమకూర్చి పెట్టడంలో అంజాది బేగం మంచి నేర్పరి. ఆర్థిక ఆవశ్యకత వివరిస్తూ ప్రజల నుండి నిధాులు సేకరించి ఉద్యామానికి ఆర్థిక జవసత్వా అందించటంలో ఆమె తనశక్తిసామర్థ్యాలను చూపారు. ఖిలాఫత్‌ ఫండ్‌ నిమిత్తం ఆబాది బానొతోకలసి లక్షలా ది రూపాయాల నిధులను సమకూర్చారు. గాంధీజీని ప్రజలకు పరిచయం చేయటం, ఆయన సాగించిన పర్యటనల వ్యయభారాన్ని భరించటంలో ఖిలాఫత్‌ కార్యకర్తలు, మౌలానా ముహమ్మద్‌ అలీ కుటుంబానికి చెందిన మహిళలు సమకూర్చిన నిధాుల పాత్రను విస్మరించలము. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Ë Yogdaan (Hindi), Dr. Abida Samiuddin, IOS, New Delhi ,1997 Page. 143-144.)


ఖిలాఫత్‌:- నిధుల సేకరణ విషయంలోమౌలానా ఇంటిమహిళలు తీసుకున్న ప్రత్యేక శ్రదను ఆంగేయాధికారి మాల్కం హేలి ఆనాటి లెజిసేవ్‌ అసెంబ్లీలో ప్రస్తావించి మౌలానా ముహమ్మద్‌ అలీ ప్రభుత్వ వ్యతిరేకత గురించి వివరిస్తూ, ఈయన ఇంటిమహిళలు కూడ చందాలు సేకరిస్తారు. విద్రోహానికి పాల్పడతారు అని ప్రకిటీంచాడు. చేసిన ఈ ప్రకటన ద్వారా ఆనాడు అంజాది బేగం,ఆబాది బానో బేగంలు నిధులు సమకూర్చటంలో చూపిన సమరత, ఆ నిధుల ప్రాధాన్యత వెల్లడవుతుంది. ఈ అంశాన్ని మరింతగా నిర్ధారిస్తూ ఆ దిశగా అంజాది బేగం సాగించినకృషిని మహాత్మా గాంధీ యంగ్‌ ఇండియా లో ప్రత్యేకంగా ఉటంకించారు.అంజాది బేగం సదా మౌలానా వెంట ఉంటూ, ఖిలాపత్‌-సహాయ నిరాకరణ

141