పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహత్ముడిచే సాహస మహిళగా కీర్తించబడిన

ఆంజాదీ బేగం

భారత స్వాతంత్య్రోద్యామ చరిత్రలో ప్రజలు కుటుంబాలకు కుటుంబాలుగా ఉద్యమించిన సంఘటనలు దర్శనమి స్తాయి. ఆ కుటుంబాలలోని పురుషులు సహజంగా బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యామిస్తుండగా, మహిళలు వారికి సహకరించటం సర్వసాధారణం. అలా కాకుండ ఓ కుటుంబంలోని స్త్రీ, పురుషులంతా ఉమ్మడిగా పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరుబాట ఎంచుకుని ఉద్యామించటం అరుదు. ఈ విధంగా ఉద్యమించి బ్రిటిష్‌ పోలీసు రికార్డులలో ' ప్రమాదాకర కుటుంబం ' అని నమోదు పొందిన అలీ సోదరుల కుటుంబ సభ్యులలో ఒకరు శ్రీమతి అంజాది బేగం.

అంజాదీ బేగం రాంపూరు సంస్థానానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన ఆడపడుచు. పుట్టినింట మంచి పుస్తక భాండగారం ఉండటంతో ధార్మిక గ్రంథాలనువిస్త్రుతంగా అధ్యాయనం చేసిన ఆమె అంతితో సరిపెట్టుకోక అందుబాటులో ఉన్నసామాజిక, ఆర్థిక, రాజకీయ గ్రంథాలను పఠిస్తూ ధార్మిక పరిజ్ఞానం తోపాటుగా లౌకిక పరిజ్ఞానాన్ని సంతరించుకున్నారు.జాతీయోద్యామంలో బీబి అమ్మగా ప్రసిద్ధిచెందిన శ్రీమతి ఆబాదీ బానో బేగం కుమారుడు మౌలానా ముహమ్మద్‌ అలీని ఆమె వివాహం చేసుకున్నారు. ఆయన విద్యార్థి

139