పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు

begin with the sepoys, but soon its true nature was reveled, it was an Islamic revolt అనాల్సి వచ్చింది. ఆనాడు బెంగాలు సివిల్‌ సర్వీసులో అధికారిగా పని చేసన Henry Harrington Thomas 1858 లో రాసిన Rebellion in India and our future policy అను శీర్షిక గల కరపత్రంలో, 'I have stated that the Hindus were not the contrivers or the primary movers of the 1857 rebellion and I now shall attempt to show that it was the result of an Mohammad conspiracy...left to their resources, the Hindus never would or could have compassed such an undertaking..’అని వ్యాఖ్యానించాడు.

వెల్లివిరిసిన అద్బుత ఐక్యత

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్యన వెల్లివిరిసిన ఐక్యత ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రగిలించింది. సామాన్య ప్రజానీకం మాత్రమే కాకుండ స్వదేశీ పాలకులు కూడ తమ విభేదాలను మరిచి ఐక్యంగా ఉమ్మడి శత్రువును ఎదుర్కోవటం వారి సామ్రాజ్య విస్తరణ కాంక్షకు విఘాతం కాగలదని భావించారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి చోదకశక్తిగా నిలిచింది ముస్లింలన్న భావనతోనున్న పాలక వర్గాలు, ప్రజానీకంలో మత విభేదాలను సృష్టించి,స్నేహ సంబంధాలను విచ్ఛిన్నం చేసి తమ మను డ కోసం ఎటువంటి ముప్పు ల కుండ ఖాన్‌ బహద్ధూర్‌ ఖాన్‌ చూసుకోవాలని అనుకున్నాయి. స్వదేశీ పాలకు లను, తిరుగుబాటు యోధులను అణిచి వేసేందుకు కూడ ఈ ఎత్తు ఉపయాగిస్తుందనుకున్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా హిందూవులను రెచ్చగొట్టి, మభ్యపెట్టిడబ్బుతో ప్రజల దేశభక్తిని కొనుగోలు చేసేందుకు భారీగా డబ్బు సంచులను రప్పించారు. ఈ మేరకు రోహిల్‌ ఖండ్‌లో డబ్బు సంచుల ద్వారా హిందూ సోదరులకు లంచాలు ఇచ్చి, అర్థిక ససౌకర్యాల ఆశ చూసించి ఆకట్టుకుని, ప్రజలను మతం పేరిట చీల్చిఅనైక్యత స్పష్టిం చేందుకు ఆంగ్లేయాధికారి జేమ్స్‌బెట్రాం (James Outram )విఫల యత్నం చేసాడు.

23