పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

భారత దేశమున


నాలుగవ ప్రకరణము

బ్రిటిషుప్రభుత్వ తత్వము

I

మహమ్మదీయ ప్రభుత్వమునకు ఇంగ్లీషు ప్రభుత్వమునకు తారతమ్యములు

బ్రిటిషువా రీ దేశాక్రమణ జేయక మునుపు భారతదేశమును పరిపాలించిన మహమ్మదీయ ప్రభువులు కూడా ఆంగ్లేయులవలెనే మొదట విదేశీయులుగ నుండిననువారి పరిపాలనకును బ్రిటిషుపరిపాలనకును చాల తారతమ్యము కలదు.

మహమ్మదీయులు మొదట విదేశీయులే యైనను వా రీ దేశమున స్థిరపడి అచిరకాలములోనే దేశప్రజలలో కలిసిపోయి ఈ దేశమునే తమస్వదేశముగా జేసికొనిరి. అందువలన వారిది దేశీయుల పరిపాలనముగనే యుండెను. దేశముయొక్క అభివృద్ధికి వారు తోడ్పడిరి. ఇచ్చటి ధనమునెల్ల ఇచ్చటనే ఖర్చుపెట్టిరి. ఇక ఆంగ్లేయులన్ననో తమ జాత్యభిమానము వీడక తా మీ దేశమున కేవలము ప్రభుత్వాధికారములు చలాయించుటకు వచ్చిన పరిపాలకుల మనియు నీదేశమువలన లాభము పొందుటకు తమకుహక్కు కలదనియు తలచి ఈ దేశము యొక్క భాగ్యభోగ్యములనెల్ల సీమకు తరలింపసాగిరి. వీరిది - కేవలము విజాతీయ పరిపాలనముగనే యుండెను. దేశప్రజలతో వీరు కలిసిమెలసి యుండక వేరింటికాపురము చేయుచు నీ దేశముయొక్క క్షేమ లాభములమాట ఆవంతయైన గమ