పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/642

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

భారతదేశమున


నివేదికలందే ప్రకటింపబడియున్నది. నేడు నూటికి 8 మంది మాత్రమే అక్షరాస్యులు. ఇది మన విద్యావిధానము లోని యభివృద్ధి! దీనిని సమర్థించుకొనుటకు ఒక సర్ బిరుదాంకితుడు మనదేశజనసంఖ్య 1870 లో 20 కోట్ల నుండి ఇప్పుడు 35 కోట్లయినదని పత్యుత్తరము చెప్పుచున్నాడు. ఇది నాగరకతగల ప్రభుత్వము చెప్పవలసిన సమాధానమేనా!

1881-1891 మధ్యజనసంఖ్యనూటికి 9.6 చొప్పునవృద్ధియైనది.
1891-1901 మధ్యనూటికి 1.4 చొప్పునవృద్ధియైనది.
1901-1911 మధ్యనూటికి 6.4 చొప్పునవృద్ధియైనది.
1911-1921 మధ్యనూటికి 1.2 చొప్పునవృద్ధియైనది.
1921-1931 మధ్యనూటికి 10.6 చొప్పునవృద్ధియైనది

ఇట్లీకాలమున నూటికి పదివంతులచొప్పున వృద్ధియగుట యొక హెచ్చులోనిది కాదని అర్థశాస్త్రజ్ఞుల యభిప్రాయము. ఆనాటికి మనకన్న వెనుకపడియున్న రష్యాదేశము, అమెరికా దేశములందు కూడ నేడు నూటికి 98 మంది విద్యావంతులుగ నున్నారు. ఇట్టి స్థితిలో మన దేశమునందు సాలుకు విద్యకొరకు చేయబడు 8 కోట్ల రూపాయిల వ్యయ మేమూలకు సరిపోవును! అత్యంతవిద్యావంతులుగ నున్న ఆదేశములలో నిప్పటికిని సాలుకు 40కోట్లు మొదలుకొని 80 కోట్లవరకు విద్యకు వ్యయము చేయుచున్నారు,

ఇక మనదేశప్రజల దామాషా ఆయుర్దాయము చూచినచో 1870 నాటికిని నేటికిని విశేషతారతమ్యముకనబడుట లేదు.