పుట:బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
దాసు శ్రీరాములు

శ్రీరాములు గారి రచనలను విశ్లేషిస్తూ, విశిష్టతను ప్రశంసిస్తూ శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు, విశ్వనాధ సత్యనారాయణగారు, విశ్వనాథ వెంకటేశ్వర్లు మొదలైన మహనీయులు వ్రాసిన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. శ్రీరాములు గారి ముని మనుమరాలు శ్రీమతి వెలగపూడి వైదేహిగారు వ్రాసిన “మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు ఒక సమీక్ష" అను సిద్ధాంత గ్రంథానికి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు పి.హెచ్.డి. ప్రదానం చేసారు.

19వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఆంధ్ర సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ రంగాలను ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు అరవై రెండు సంవత్సరాలు జీవించి, 1908 మే 16న దేవీకటాక్ష సిద్ధిపొందారు.

మహాకవికి మహనీయుల ప్రశంసలు

"కవులుండ వచ్చును, పండితులుండవచ్చును, ఐశ్వర్యవంతులుండవచ్చును కాని దాసు శ్రీరామకవి వంటి ధన్యులు కోటికొకరేని చేకూరుట అరుదు. శ్రీరామకవి చంద్రుని రెండవ శ్రీనాధునిగా నామనసున అనుకొందును. ఈయన సరసకవి, విద్వత్కవి, ఆశుకవి,దాత, నేత. ఇన్ని యోగాలు పట్టినవారు ఏకకాలంలో మృగ్యులే. ఇన్ని అదృష్టములు సంఘటించిన కవి లేనేలేడు".

- బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“దాసు శ్రీరాములు గారు గొప్ప పండితుడు, గొప్ప కవియును మాత్రమే గాక గొప్ప న్యాయవాది, గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప దేశాభిమానియై యుండి 1846-1908 సం॥ మధ్య ఆంధ్రదేశ సాంఘిక, సాంస్కృతిక, మత, రాజకీయాభివృద్ధి కొరకు పాటుపడిన మహాపురుషులలో నొకరు. ఆంధ్రదేశ ప్రజలకు, ఆంధ్రభాషకు ఆయన చేసిన సేవ అసామాన్యమైనది.”

- శ్రీ దిగవల్లి వేంకట శివరావు, ప్రముఖ న్యాయవాది,చరిత్రకారులు

“దాసు శ్రీరాములు గారు వ్రాసిన దేవీభాగవతము చదివి ఆనందించుటయు, చిన్నప్పటి మాకవితాసాధనలో వీరి గ్రంథముకూడా నొకటియగుటయు, మాకు బాగా జ్ఞాపకమున్నది ... ఈ గ్రంథములో గడుసు పోకడలెన్నియో కలవు. తెలుగు పలుకుబళ్ళు

6