అపూర్వ రచనా వ్యాసంగమూ మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించేవారు. మహాకవి దాసు శ్రీరాములు గారు నివసించిన ఆ పవిత్ర గృహములోనే (ప్రస్తుతము 'గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయము' నడుపబడుచున్నది.
మహాకవి దాసు శ్రీరాములు గారు ఏలూరులో నివసించిన పవిత్ర గృహ ప్రాంగణము
ప్రస్తుతము 'గాంధీ ఆంధ్రజాతీయ మహా విద్యాలయము'
శ్రీరాములు గారి విద్యాఖిమానం, బెదార్యం
ఏలూరులో ఒక పాఠశాల యాజమాన్యం, బసవరాల రామబ్రహ్మం అనే ఆంగ్లభాషా ఉపాధ్యాయుడిని అన్యాయంగా ఉద్యోగంలోంచి తొలగించారు. ఆయన శ్రీరాములు గారిని ఆశ్రయించగా వెంటనే 'హిందూ పేట్రియాటిక్ స్మూల్'ను స్థాపించి ఆయననే ప్రధానోపాధ్యాయునిగా నియమించి చాలా కాలం నడిపించారు. శ్రీరాములు గారి విద్యాభఖిమానానికి బెదార్యానికి ఇది దర్భణం.
సంఘ సంన్మర్త - పత్రికా నిర్వాహకులు
దాసు శ్రీరాములు (1846-1908), కందుకూరి వీరేశలింగం (1848-1919) మరియు గురజాడ అప్పారావు (1862-1915) సమకాలీనులు. వీరేశలింగం గారి విధవాపునర్వివాహోద్యమాన్ని మొదట్లో “అనల్ప జల్పితాకల్పవల్లి' అనే పత్రిక నడిపి వ్యతిరేకించారు. కాని, తరువాత దాని అవసరం గుర్తించి మనస్ఫూర్తిగా ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించారు.