పుట:బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపాధ్యాయునిగా శ్రీరాములు గారు

అల్లూరు విడచి గుడివాడలో ఆంగ్ల ఉన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా చేరి, విద్యార్థులకు తెలుగు బోధిస్తూ, స్వయంగా ఇంగ్లీషు నేర్చుకున్నారు. తరువాత కౌతరంలో పనిచేసారు. డోకిపర్రు గ్రామస్తుల కోరికపై అక్కడ పాఠశాల నెలకొల్పారు. విద్యాబోధన చేస్తూ ఇంగ్లీషు టెస్టులు, ప్లీడరీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసారు. బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టడానికి 1878లో డోకిపర్రు విడిచి వెళ్లేటప్పుడు ఆ గ్రామస్తులు శ్రీరాములు గారిని వెండి పూలతో పాదపూజచేసి, బంగారు పూలతో శిరస్సు పూజించి, ఊరి పెద్దలు స్వయంగా 'మేనా మోసి' గౌరవించి వీడ్కోలు చెప్పారు. అటువంటి భక్తిపూర్వక సత్కారం తరువాత కాలంలో డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికే దక్కింది.

న్యాయవాదిగా శ్రీరాములు గారు

శ్రీరాములు గారు మొట్టమొదట 1878 సం.లో బందరులో న్యాయవాద వృత్తి చేపట్టి తరువాత 1883 నుంచి 1895 వరకు ఫస్టుగ్రేడ్ ప్లీడర్ ఏలూరు సబ్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఏలూరులో కాలువకు దక్షిణమువైపున ఒక ఎకరం స్థలములో స్వగృహము నిర్మించుకొని జీవితాంతమువరకు, అంటే దాదాపు 24 సంవత్సరాలు ఈ పవిత్ర ప్రాంగణములో నివసించి, ప్రముఖ న్యాయవాదిగా, సంఘసంస్కర్తగా, మహాకవిగా తమ

3