102
బసవపురాణము
చర్చింపఁగా సర్వసామాన్యమగుటఁ
గూర్చెద ద్విపదలు గోర్కిదైవాఱఁ
- బసవపురాణము.
..................................................
ఒప్పదు ద్విపద కావ్యోక్తి నావలదు
ఆరూఢ గద్యపద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్టరచన
మానుగా సర్వసామాన్యంబు గామి
జానుఁదెనుఁగు విశేషము ప్రసన్నతకు
- పండితారాధ్యచరిత్రము.
సోమనాథుఁడే జానుఁదెనుఁగనఁగా నిట్టిదని వృషాధిపశతకమున జెప్పినాఁడు:
చ. బలుపొడతోలుసీరయును బాఁపసరుల్ గిలుపారుకన్ను వె
న్నెల తల సేఁదుఁగుత్తుకయు నిండిన వేలుపుటేఱు వల్గు పూ
సలు గలఱేని లెంక వని జానుఁదెనుంగున, విన్నవించెదన్
వలపు మదిన్ దలిర్ప బసవా బసవా బసవా వృషాధిపా!
ఆ కాలమున నీ జానుఁదెనుఁగు మిక్కిలి ప్రసన్నమై సర్వసామాన్యమై యుండెను. తర్వాతి మన కవీశ్వరులు సంస్కృతప్రాయమైన రచనను దెలుగునఁ జొప్పించి జానుఁదెనుగును సన్నగిలఁ జేసిరి. ఇటీవలి తెలుఁగురచనలలో నెక్కువ రుచ్యములయిన నానుళ్లును బలుకుబళ్లును మిక్కిలి తక్కువ కాఁజొచ్చెను. సోమనాథుని గ్రంథములోను, నన్నిచోడని గ్రంథము లోను మన కిపు డర్ధము గాని జానుఁదెనుగుఁబలుకు లనేకము లున్నవి. సంస్కృతప్రాయముగ రచనలకు మన మలవడుటయు, దేశితెలుఁగురచనలఁ ద్రోసిపుచ్చుటయు నిట్టగుటకుఁ గారణములు. ఈ విషయము నించుక వివరింతును.