పుట:ప్రబోధచంద్రోదయము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని కృతిపతి పలికిన మాటలు అనగా హారము కూర్పుచేత, నెంత రమణీయముగా మది, మనోహర మగునో నీకావ్యమును తమకూర్పు నేర్పుచేత కమనీయముగను, మనోరమముగను దిద్దితీర్చి యున్నారు.

ప్రబోధచంద్రోదయము సానల దీఱిన జాతిరత్నము. ఈ కావ్యము సభలో పండితకవులు దీనిని పరిశీలించిరనియు, వారి పరిశీలన మూలమున నిది మెఱుగెక్కినదనియు, నీ కవులే యిట్లు తెలిపినారు.

క.

పొరి పొరి నొప్ప సలాకల
నొరసిన కుందనపుఁ బూదెయును బోలె సభన్
సరసుల సంఘర్షణమున
వరకవి కావ్యంబు మిగుల వన్నియ కెక్కున్.

(1-22)

గంగమంత్రి సభలో కవి పండితు లీకావ్యమును నామూలచూడముగా పరీక్షించిరనియు, వారి పరీక్షలో నిది నిలిచి, వారి ఆమోదముద్ర బడసినదని పైపద్యతాత్పర్యము.

తక్కిన కవు లెవ్వరును నిట్లు సభలో పండితకవులను ప్రత్యేకముగా పేర్కొనలేదు. రాజాస్థానములలో పండితకవులు మాత్సర్యగస్తులు, వా రెప్పుడను తప్పులు వెదకుటకే ప్రయత్నించి, కావ్యమును ప్రభు వంకితము గొనకుండ చూచెదరు. ఇది వీరి సౌమనస్యము తెలుపుచున్నది. అట్టి పరిస్థితులలో, నీకవులకృతి ప్రబోధచంద్రోదయము, కవిపండితుల పరీక్షను నిలిచిన కృతి యగుటచేతనే, నేటికిని నీకృతి పండితకవివిద్వన్మాన్యమై యలరారుచున్నది.

పూర్వకవుల యనుసరణలు

నన్నెచోడకవి కుమారసంభవము

క.

కరిఁగరి భటుభటుఁ డరదం
బరదంబు హయంబు హయము నని మొత్తములై
గర గరి జమ జము డిలనిల
శరనిధి శరనిధియుఁ దాఁకుచాడ్పున దాఁగెన్

(కు.సం. 11-108)