పుట:ప్రబోధచంద్రోదయము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వన్నెలు పచరించి కన్నుసన్నలు చేసి
                          వెడమాటలను బ్రేమ గడలు కొలిపి
తరితీపునటనలఁ దమకంబుఁ బుట్టించి
                          వట్టి ప్రియంబుల గుట్టు తెలిపి
కలికితనంబున కాఁకలు గావించి
                          తోడి నీడలు వోలె గూడి మాడి
యలుకల నలయించి కలయిక వలపించి
                          బానల నడియాస పాదుకొల్పి


గీ.

మనసు కరగించి బ్రమయించి మస్తరించి
మిగులఁ జొక్కించి యెంతయు దగులు పఱచి
పాసి యెడఁ బాసి తమబంటు చేసికొనరె
వామలోచన లెంతటివారినైన.

(1-75)

ఇది సంస్కృతమూలమునకు చక్కని వ్యాఖ్యానానువాదము.

శ్లో.

క్షేత్రగ్రామవనాది పత్తనపురద్వీపక్షమామండల
ప్రత్యాశాయతసూత్రబద్ధమనసాం లబ్దాధికం ధ్యాయతాం
తృష్ణేదేవీ యదిప్రసీదసి తనోష్యంగాని తుంగానిచే
త్తద్భోఃపిప్రాణభృతాంకుతః శమకథా బ్రహ్మాండ లక్షైరపి

(2-32)


సీ.

పుడమిలో మాన్యంపుమడి కొంత గలవాఁడు
                          గ్రామమెల్లను నేలఁగా దలంచు
గ్రామ మేలెడువాఁడు కాంక్షించు గిరివన
                          స్థలజలదుర్గవద్రాజ్య మేల
రాజ్య మేలెడువాడు రాజ్యవైభవమున
                          హెచ్చి తా నొకద్వీప మేలఁగోరు
ద్వీప మేలెడువాఁడు తేజస్వియై మహీ
                          వలయ మెల్లను నేల వాంఛ సేయు