పుట:ప్రబోధచంద్రోదయము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

కలరు కౌశికగోత్రకలశాంబురాశి మం
                          దారంబు సంగీతనంది నంది
సింగమంత్రికిఁ బుణ్యశీల పోచమ్మకు
                          నాత్మసంభవుఁ మల్లయమనీషి
అతని మేనల్లుఁ డంచితభారద్వాజగో
                          త్రారామచైత్రోదయంబు ఘంట
నాగధీమణికిఁ బుణ్యచరిత్ర యమ్మలాం
                          బకుఁ గూర్మితనయుండు మలయమార్ము


గీ.

తాహ్వయుఁడు సింగనార్యుఁడు నమృతవాక్కు
లీశ్వరారాధకులు శాంతు లిలఁ బ్రసిద్ధు
లుభయభాషల నేర్పరు లుపమరులు స
మర్థు లీకృతిరాజనిర్మాణమునకు.

(1-24)

పైరెండు కృతులలో నాశ్వాసాంతగద్య లొకే తీరున నున్నవి.

"ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారస్వతాభినంది నంది సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్లజ మలయమారుతాభిధాన నాగయ ప్రధాన తనయ సింగయకవిపుంగవప్రణీతంబైన..........ప్రథమాశ్వాసము"

పైగద్యయందేగాక, వరాహపురాణమున వీరిరువురు నెల్లప్పుడు నొకరి నొకరు విడువక శరీరప్రాణమువలె నుండువారని యిట్లు తెలుపబడినది.-

క.

మీరిరువురు నెప్పుడును శ
రీరప్రాణములక్రియఁ జరింతురు మిగులం
గూరిమిఁ గృతిఁ బ్రతిపద్యము
చారుఫణితి చెప్పఁగలరు చాటువు గాఁగన్.

(1-32)