పుట:ప్రబోధచంద్రోదయము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథకర్తలు – జంటకవులు

(నంది మల్లయ - ఘంట సింగయలు)

వీరిచరిత్ర నెఱుంగుటకు వీరికృతులు రెండుమాత్రమే మనకు లభ్యములగుచున్నవి.

1. వరాహపురాణము. 2. ప్రబోధచంద్రోదయము వీరిపేరున వినబడు మఱి యొకగ్రంథము కవులషష్ఠము భాగవత షష్ఠస్కంధము) ఇందు కొన్నిపద్యములు మాత్రము లభ్యమగుచున్నవి. లభ్యములైన వానిరెండింటినుండి వీరిచరిత్రను గూర్చిన వివరములు:-

వరాహపురాణము-
సీ.

అపుడు సభావేది కాగ్రస్థితులమైన
                          మమ్ము వాగీశ్వరీమంత్రరాజ
సిద్ధి పారగులఁ గౌశిక భరద్వాజగో
                          త్రుల మహాదేవాంఘ్రిజలజభక్తి
పరతంత్రమతుల నాపస్తంబసూత్రుల
                          గురుదక్షిణామూర్త్యఘోరశివుల
శిష్యుల నతిశాంతచిత్తులఁ దనకు నా
                          శ్రితుల భాషాద్వయకృతి నిరూఢ


గీ.

శేముషీభూషణుల నంది సింగనార్య
తనయు మల్లన కవికులోత్తముని ఘంట
నాదధీమణి కూర్మినందనుని మలయ
మారుతాంకితు సింగయమంత్రిఁ జూచి.

(1-31)