పుట:ప్రబోధచంద్రోదయము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందువలన వీరిరువురు [1]జంటకవులని స్పష్టము.

నివాసము

వీరిరువురి నివాసము మైసూరు రాష్ట్రమున కోలారు మండలమున చికబల్లారము తాలూకా నందిగ్రామమని యొక పరిశోధకులు తెలిపిరి[2]. ఇందువలన వీరు దాక్షిణాత్యకవు లగుచున్నారు. కాని కర్నూలు మండలమున గల మహానంది క్షేత్రమును బట్టియు - వీరిలో నొకడైన ఘంటసింగయ గురువు - అఘోర శివాచార్యుల నివాసము కడప మండలమున పుష్పగిరి యగుట చేతను వీరు తెలుగుదేశపు కవులే యనుట నిశ్చితము.

వంశ వివరణ

నంది మల్లయ—

ఇతడు కౌశికగోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. దక్షిణామూర్తి గురుశిష్యుడు. నంది సింగమంత్రికి పోచమ్మకు పుత్రుడు.

ఘంట సింగయ—

ఈతడు భారధ్వాజగోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. ఘంట నాగయకు అమ్మలాంబకు పుత్రుడు. అఘోర శివాచార్యుల శిష్యుడు. నంది మల్లయకు ఘంట సింగయ మేనల్లుడని పైనచెప్పబడినది. వారిసంబంధము నీ క్రిందివిధముగా నుండునని యూహింపవచ్చును.

  1. చూడుడు: తెలుగులో జంటకవులు అను శీర్షిక.
  2. అష్టదిగ్గజకవిసమాజములో రాయల నాశ్రయించిన తొలికవి ఎవరు? - శ్రీ కే. యస్. కోదండరామయ్య. పుటలు, 62-63 (1972)