పుట:ప్రబోధచంద్రోదయము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తపనసూనుఁడు తారఁ దా నాక్రమింపఁడె
                          యన్నప్రాణములకు నఱ్ఱుఁదలఁచి


గీ.

మఱియు నిట్లు జగంబుల మరులు కొలిపి
ఎట్టి నియతాత్మకులనైన గుట్టుచెఱిచి
కానిత్రోవల నడిపించు కడిమి నాదు
వాలుతూపులగమి కవలీలగాదె.

(1-50)

మూలశ్లోకములో, బ్రహ్మ - కూతురు సరస్వతి, అహల్య - ఇంద్రుడు, చంద్రుడు - తార అను మూడు దృష్టాంతములు మాత్రమే యున్నవి. సీసపద్యములో నీయనువాదము సాగినది గాన, నాలుగవపాదమున సమతత్వముకొఱ కింకొకదృష్టాంతము కావలసియున్నది. దానిపై నాల్గవపాదమున వాలి తారను లేవదీసుకొని పోవుట రామాయణమునుండి గ్రహింపబడినది.

శ్లో.

శ్రీదేవీ జనకాత్మజా దశముఖస్యాసీత్ గృహేరక్షసో
నీతాచైవ రసాతలం భగవతీ వేదత్రయీ దానవైః
గంధర్వశ్చ మదాలసాంచతనయాం పాతాళకేతుశ్చలాత్
దైత్యేంద్రోపజహారహస్తవిషమావామావిధేర్వృత్తయః

(3-4)


సీ.

చాపచుట్టఁగఁ జుట్టి చంకఁబెట్టుక పోఁడె
                          ధరణి హిరణ్యాక్ష దానవుండు
వేదత్రయీకాంత వెస మ్రుచ్చిలింపఁడె
                          చూఱపట్టిన యట్లు సోమకుండు
సాక్షాన్మహాలక్ష్మి జనకభూపాలనం
                          దనఁ జెఱపట్టఁడే దశముఖుండు
కొసరక యమ్మదాలసఁ గొనిపోఁడె పా
                          తాళకేతుఁ డనునక్తంచరుండు


గీ.

కాన నింతేసివారముగా యనంగ
రాదుపో యెట్టి పుణ్యవర్తనున కైన