అంకములకు ఆఱాశ్వాసములు చేసిన యెడల, ఆశ్వాసములు చాల చిన్నవి యగును. అందువలన కవు లిట్లు చేసినారని మనము భావించవలెను.
మూలమున చతుర్ధాంకము "మైత్రి" అను పాత్రతో ప్రారంభము. కాని తెలుగున - ఆ పాత్ర తృతీయాశ్వాసముననే ప్రవేశపెట్టబడినది. వివేకమహారాజు స్వగతము. ఆవెనుక వస్తువిచారుడు వచ్చుట గలదు. పంచమాంకమున గల కథయంతయు. చతుర్థాశ్వాసముననే చెప్పబడినది. ఇందుమూలమున సంస్కృతమూలమునగల ఆఱు అంకములు తెలుగున ఆయిదాశ్వాసము లైనవి.
గ్రంధకర్తలు శైవులు. శివుడు పంచముఖుడు గాబట్టి మూలమున 6 అంకములున్నను, తెలుగున 5 ఆశ్వాసములుగా వ్రాసిరని మనము సమర్థించుకొనవరెను.
ఈసంస్కృతనాటకము యథామూలముగానె అనువదింపబడినది. కాని సంస్కృతమునగల శ్లోకములు, తెలుగున సీసపద్యములు వ్రాయునపుడు మూల భావములు మూడు పాదములలో నిమిడిన నాలవపాదమున ఎత్తుగీతియందు స్వంతకల్పన కథాసందర్భమున చేసిరి.
(i)శ్లో. | అహల్యాయై జారః సురపతిరభూరాత్మా తనయాం | (1-14) |
సీ. | తనకన్నకూతును దాన పెండ్లాడఁడే | |