పుట:ప్రబోధచంద్రోదయము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నిర్గ్రంథో౽ర్హః క్షపణకః శ్రమణోజిన ఇత్యపి" అని వైజయంతి ప్రతిదినకేశలుంఠనత్వము దిగంబరత్వము - వారి ముఖ్యలక్షణములు. దశకుమారచరిత్ర అపహారవర్మ కథలో క్షపణకులు వత్తురు. జైనులలో రెండు తెగలు.

1 దిగంబరులు, 2. శ్వేతాంబరులు

ప్రబోధచంద్రోదయమున దిగంబరులగు క్షపణకులు మాత్రమే పేర్కొనబడినారు.

బౌద్ధమతము

దీనికి సౌగత మతమని మరియొకపేరు. దీని స్థాపకుడు సుగతుడు, సిద్ధార్థుడు అను నామాంతరములుగల బుద్ధుడు. వీరి సిద్ధాంతమున నాలుగుభావనలు

1. సర్వము క్షణికము క్షణికవిజ్ఞానమాత్మ
2. సర్వము దుఃఖము
8. సర్వము స్వలక్షణము
4. సర్వము శూన్యము

ఈ బౌద్ధులలో నాలుగుతెగలవా రున్నారు. వారు

1. సౌత్రాంతికులు - బాహ్యనుమేయత్వవాదులు
2. వై భాషకులు - బాహ్యర్థప్రత్యక్షవాదులు
3. యోగాచారులు - బాహ్యశూన్యత్వవాదులు
4. మాధ్యమికులు - సర్వశూన్యవాదులు

జై నమతమువలె బౌద్ధమతము నాస్తికమే అయినకు కొంతభేద మున్నది. భారతీయులు బుద్ధుని విష్ణువు దశావతారములలో నొకయవతారముగా పరిగణించినారు. అయినను, నాస్తిక మగుటవలన మనదేశమున ప్రచారములో లేదు. చైనాదేశమున నేటికి ప్రచారమునందున్నది.

నాటకమున యొకబుద్ధముని ప్రసక్తి కలదు. 3వ అశ్వాసము