ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కామాదులకు వివేకాదులకుగల దాయాదిత్వ మిట్లు నాటకమున నిరూపితమైనది.
పై వంశవివరణము వలన - కామక్రోధాధులు వివేకాదులు దాయాదు లైనారు. ఇర్వురు సపత్నులయందు సమానమైన రాజ్యకాంక్ష యుదయించిన కతకమున కౌరవ పాండవులకు రాజ్యవిషయమై యుద్ధము జరిగినట్లుగా నీనాటకమున ఇరుపక్షములవారికి తగువులు గలుగుచుండెను. ఆనాడు దుర్యోధనునివలె, ప్రవృత్తిసతులలో మోహుడు రాజ్యము నాక్రమింపగా, పాండవులలో ధర్మరాజు వంటి వివేకుడు కొంతకాలము పైదొలగి, ఆ వెనుక విద్యాప్రబోధచంద్రులవలన మోహుని జయించి సామ్రాజ్యము నాక్రమించి ఆనందు డై వెలసెను.
వివేకునకు మతి ఉపనిషత్తరుణి యను నిరువురు భార్యలు. వారివలన సుతు లుదయించిరి. ఆ వివరణ