అద్వైతమతసిద్ధాంతమును ప్రతిపాదించు పురంజనోపాఖ్యానము మూలముగా గైకొని, కృష్ణమిశ్రుడు అద్వైతవేదాంతసిద్ధాంతము ప్రతిపాదక మైన ప్రబోధచంద్రోదయము రచించినాడు. ప్రబోధము - జ్ఞానమనెడి; చంద్ర - చంద్రునియొక్క; ఉదయము - ప్రబోధచంద్రోదయము.
నాటకసంవిధానము
ఈ నాటకసంవిధానమును గూర్చి యొకకథ గలదు. కృష్ణమిశ్రుడు రాజైన కీర్తివర్మకు అద్వైతమతతత్త్వ మెంత బోధించినను మనసునకు పట్టలేదు. అంతట నాతడు కామక్రోధలోభాదిగుణములను పాత్రలుగా చేసి అవి అరిషడ్వర్ధములుగాన రాజులకు శత్రువులతో యుద్ధము చేయుట ప్రియముగాన అరిషడ్వర్గములైన కామాదులకు, మతి, వివేకము, క్షమ, వైరాగ్యము, శాంతి, మనము అనువానిని పాత్రలను గావించి, వారిరువురకు యుద్ధమును గల్పించి తుదకు ప్రబోధము జ్ఞానము జయించెనని నాటకము సమాప్తి చేసినాడు.
ఇచట కామాదులు, వివేకాదులు అను రెండు పక్షములున్నవి. గావున నీరెండు పక్షములను దాయాదులనుగా నిందు పాత్రీకరించినాడు. మహాభారతమున కౌరవ పాండవులకు యుద్ధము దాయభాగము మూలముననే జరిగినది గావున అందు అధర్మప్రవర్తకులైన కౌరవులను ధర్మప్రవర్తకులైన పాండవులు జయించినట్లుగా నీ నాటకమున కామాదులను వివేకాదులు జయించినట్లు చెప్పబడినది.
శ్లో. | ఏకామిష ప్రభవమేవ సహోదరాణాం | (1-28) |
మ. | అవలేపంబున నన్నదమ్ములగు మోహాదుల్ వివేకాదులున్ | (1-43 |