అద్వైతపరముగా నీనాటకము వెలసిన వెనుక వేదాంతదేశికులు (1270-1372) విశిష్టాద్వైతపరముగా సంకల్పసూర్యోదయము అను నాటకమును ఆ వెనుక మల్లనారాధ్యుడను నాతడు శివాద్వైతపరముగా "శివలింగసూర్యోదయము” అను నాటకమును రచించిరి. కాని ప్రబోధచంద్రోదయమునకు వచ్చిన కీర్తి వీనికి రాలేదు కేవలము ఆనుకరణములుగా నిలిచిపోయినవి.
ఈ నాటకమునకు క్రీ.శ. 1520లో కొండవీటి దుర్గాధ్యక్షుడు కృష్ణరాయల మహామంత్రి సాళ్వతిమ్మరసు మేనల్లుడునగు నాదిండ్లగోపమంత్రి "చంద్రిక" అను పేర నొకవ్యాఖ్యానము రచించినాడు. ఆవ్యాఖ్యానముతోడనే ఈ నాటకము ముద్రితమైనది (1924). ఇటీవల పోడూరి సుబ్రహ్మణ్యసుధి ప్రౌఢప్రకాశ యను పేర నీనాటకమును వ్యాఖ్యానించెను. తంజావూరి ఘనశ్యాముడు కూడ నొకవ్యాఖ్య రచించెను. (D12560 మ.ప్రా.లి.పుస్తకశాల).
నాటకవిశిష్టత
ఈ నాటకవిశిష్టతను జంటకవు లి ట్లవతారికలో పేర్కొన్నారు.
సీ. | వివరింపనిది సర్వవేదాంతసారంబు | |
గీ. | యిమ్మహారసపాకము నెఱిఁగినట్టి | (1-21) |