లనియు సభవారిచేతనే చెప్పించుట జరిగినది. ఇట్లు కవిపేరు చెప్పుట నాటకప్రస్తావనపద్దతి.
కృతిపతి వంశవివరములు
గంగమంత్రి పూసపాటి మాధవవర్మ వంశీయుడైన బసవభూపాలునియెుద్ద మంత్రిగా నుండెడివాడు.
సీ. | మాధవవర్మ భూమండలేశ్వరు వంశ | |
గీ. | నట్టి గుణశాలి తమ్మరాయనికుమార | |
గంగమంత్రియేగాక అతనికి ప్రభువైన యీ బసవరాజును కవిపోషకుడు. ఈతడు నెల్లూరిమండలమున ఉదయగిరి రాజ్యమున కధిపతియై ఉదయగిరిలో నుండువాడు. దూబగుంట నారాయణకవి తన పంచతంత్రమను కృతిని నీ బసవరాజునకే అంకితము గావించెను. గంగమంత్రి బసవరాజు మంత్రి గావున నాతడు ఉదయగిరి వాస్తవ్యుడై యుండెనని మనము గ్రహింపవచ్చును.
వంశ విశిష్టత
ఈ గంగమంత్రి ఆర్వేలనియోగిశాఖీయుడు. కాశ్యపగోత్రుడు. ఈగ్రంథమున నాతడు "పెసరవాయాన్వవాయ" అని సంబోధింపబడుటచేత నీతని