పుట:ప్రబోధచంద్రోదయము.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

డగ్గఱిలి మైత్రిభామిని
డగ్గుత్తిక యిడుచు నక్కటా ప్రాణసలీ
బెగ్గిలి నన్ను నెఱుంగవు
దిగ్గనె గుండెయని తన్నుఁ దెల్పినపిదపన్.

75


శా

ఏ నింకేమని చెప్పుదున్ జెలి మహాహిక్రూరనిశ్వాసయున్
నానామర్త్యకపాలకుండలియు దంష్ట్రాచంద్రరేఖాంతర
స్థానప్రోల్లలజిహ్వయున్ హుతవహజ్వాలాక్షియున్ ఘోరశై
లానూనాంగియు నైన భైరవి మహాహంకారహుంకారియై.

76


క.

పిడుగువలె వచ్చి నన్నొక
పిడకిట మరి ధర్ము నొక్కపిడికిటఁ గొని తా
నుడువీథి కెగసి మాంసము
నొడిసి వడి న్నెగయు గృధ్రియుం బలె నన్నున్.

77


గీ.

అద్దిరమ్మ యనుచు నామైత్రి మూర్చిల్ల
సేదదేర్చి శ్రద్ధ చెప్పఁదొడఁగె
నపుడు విష్ణుభక్తి యస్మదీయంబైన
యార్తరవము విని దయార్ద్ర యగుచు.

78


క.

భ్రూభంగ భయదఫాలయు
నాభీలకటాక్షవీక్షణారుణమయునై
యాభైరవి నదలింప న
భోభాగము విడిచి యదియు భూమిం ద్రెళ్ళెన్.

79


వ.

ఇటు విష్ణుభక్తిమహాప్రభావంబునఁ గాళరాత్రిదంష్ట్రాకరాళవదనగహ్వ
రంబు వెలువడి నిన్నుఁ జూడంగల్గుట పునర్జన్మం బని శ్రద్ధాసరోజనేత్ర
మైత్రిం గౌఁగిలించి తరువాతివృత్తాంతంబు చెప్పందొడంగె నట్లు నన్నును
ధర్ముని విడిపించి విష్ణుభక్తిమహాదేవి మోహుకృత్యంబున కత్యంత
కుపితచిత్త యై యద్దిరా యిద్దురాత్ముండు గద్దఱితనంబున నన్నుం గైకొనక
తిరుగుచున్నవాఁడు వీని నిర్మూలంబు గావింతునని ప్రతిజ్ఞ పలికి నన్నుం