పుట:ప్రబోధచంద్రోదయము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యిందువలన నొప్పమేదైన వినవలె
ననుచుఁ దానె చదువుకొనియె నిట్లు.

52


సీ.

శ్రీమతు వారణాసి మహాపట్టణ
                          స్వామి రాజాధిరాజ పరమేశ్వ
రుఁడు మహామహేశ్వరుని దివ్యపాదప
                          ద్మంబులకును మానమదులు సద్వి
నయభక్తిదండప్రణామంబు భక్తిఁ గా
                          వించి చేయంగల విన్నపంబు
తనతల్లిశ్రద్ధయుఁ దాను శాంతి వివేక
                          భర్తకు నుపనిషద్భామినికిని


గీ.

నడుపుచున్నది దౌత్యంబు విడువ కెపుడు
కామసఖుఁడైన ధర్ముండుఁ గలయ మాట
లాడె వైరాగ్యముఖ్యులతోడ నిది
నిబద్ధి తప్పదు దేవరపాదమాన.

53


క.

అని చదువుకొనుచు మిక్కిలి
కనలి మహామోహుఁ డాత్మఁ గటకట! లోకం
బున శాంతికి వెఱతురే త
జ్జననంబే మొదల లేదు సంశయమేలా.

54


మ.

నియతాత్ముండు విరించి భారతికి నెంతే చిక్కె దక్షాధ్వర
క్షయకారీశుఁడు గౌరికౌఁగిటను జొక్కెన్ వార్ధిలోఁ గైటభా
రియ లక్ష్మీయువతీకపోలమకరీరేఖాంకితోరఃస్థలుం
డయి తక్కెన్ మఱి యున్నజంతువుల కాహా! శాంతి సిద్ధించునే?

55


గీ.

అనుచు విశ్వాసియగు ధర్ము నణఁగ నీవు
పట్టి బంధించుమని కాముఁ బంపువెట్టి
క్రోధలోభులు మీరును గూడి శాంతి
గొట్టివైవుండు పొండనఁ గ్రోధుఁ డనియె.

56