పద్యములుకొన్ని సింగనకృతిలో చేరకపోలేదు. అదెట్లు జరిగినదో చెప్పుట కష్టము. షష్ఠస్కంధకవులు ఇంచుమించు సమకాలీనులు. కవులషష్ఠమని బహువచనరూపము చెప్పబడుటచే నీగ్రంథము నందిమల్లయ, ఘంటసింగయ్యలదే యని చెప్పవచ్చును.
ఈగ్రంథము లభ్యముకాలేదు. కాని యిందలి మొదటిపద్యము ఆడిదము సూరన తన కవిసంశయవిచ్ఛేదము అను లక్షణగ్రంథమున నుదాహరించినాడు.
| శ్రీరామామణి సీతనాథుని యురస్సీమన్ నిజచ్చాయఁ గ | (1-99) |
గణపవరపు వేంకటకవి, కవులషష్ఠము - అని ఆంధ్రప్రయోగరత్నాకరమున తిమ్మయతనూజుడు తిమ్మరాజని చికశబ్దము లేకుండనే వాడియున్నాడు.
| చండాంశు ప్రభవీక్ష తిమ్మయతనూజా తిమ్మ! విధ్వస్తపా | |
ఇందువలన చికతిమ్మరాజునకు తిమ్మరాజను పేరున్నట్లు స్పష్టము.
ముద్దరాజు రామన కవిజనసంజీవనిలో (1-84) పైవద్యములోని రెండు మూడు పాదము లుదాహరింపబడినవి.
కవులషష్ఠము కృతిపొందిన తిమ్మరాజు క్రీ.శ 1521 సంవత్సరమున నున్నట్లుగా నీక్రింది కన్నడశాసనము తెలుపుచున్నది.
తిమ్మరాజు శాసనము
స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవరుషంగళు 1443 నైయ విక్రమ సంవత్సరద మాషుశు 7 లూ శ్రీమతు రామచంద్ర వీరభాండారతె